Tiger Attack: ఆవుపై దాడి చేసింది చిరుత కాదు హైనా.. తేల్చేసిన అటవీశాఖ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger Attack: రంగారెడ్డి జిల్లా కొత్తూరు గ్రామ శివార్లలో చిరుత సంచారం భయాందోళకు గురిచేసింది. ఆవుపై దాడి చేయడంతో గ్రామస్తులు భయంతో బయటకు రావడానికి జంకుతున్నారు. కొత్తూరు గ్రామం శివార్లలోని పెంజర్ల రోడ్లో చిరుత సంచరించి ఆవు, గెదలపై దాడి చేస్తుందంటూ గ్రామస్తుల అందోళన చెందారు. కొందరు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి పులి సంచరించిన చోటు, ఆవు, గేదెపై దాడి చేసిన స్థలాలను అమనగల్ రేంజ్ అటవీశాఖ అధికారులు పరిశీలించారు.
Read also: Sreeleela : వామ్మో.. శ్రీలీలలో ఈ టాలెంట్ కూడా ఉందా?
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఆవుపై దాడి చేసింది చిరుత కాదని హైనాగా అటవీశాఖ అధికారి రవీందర్ తేల్చారు. సంఘటనా స్థలంలో ఎక్కడ చిరుత అనవాలు లేవని స్పష్టం చేశారు. ఆవుపై దాడి చేసింది హైనానే అని అటవీ శాఖ అధికారి రవీందర్ చెప్పాడు. గతంలో ఇదే ప్రాంతంలో చిరుత సంచరించిన విషయం వాస్తవమే కాని చిరుతను బంధించామని క్లారిటీ ఇచ్చారు. ఎవరు కూడా బయపడవద్దని రవీందర్ తెలిపారు. హైనాను త్వరలో బోన్ ఏర్పాటు చేసి బందిస్తామని తెలిపారు. ప్రజలకు చిరుత ఉందని భయం వీడాలని.. హైనా గ్రామంలో తిరుగుతుందని ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాత్రి పూట బయటకు రావద్దని, పిల్లలను బయటకు పంపవద్దని సూచించారు. త్వరలోనే హైనా ను పట్టుకుంటామని తెలిపారు.
Read also: Chandrababu Naidu: చంద్రబాబుపై సీఐడీ పీటీ వారెంట్లు.. తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు!
మరోవైపు మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సంకారం గ్రామం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరాం హడలెత్తిస్తోంది. దాడిలో రెండు ఆవులు మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మేకలు,ఆవులు కాసే వారిని అడవిలోకి వెళ్లకూడదని అధికారులు గ్రామస్థులను హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని బయట తిరిగే టప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. త్వరలోనే పులిపట్టుకుంటామని తెలిపారు.
Uttarpradesh : సీఎం యోగి కఠిన వైఖరి..యూపీలో అల్లర్లకు ఫుల్ స్టాప్
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!