Elephant: తీవ్ర విషాదం.. రైలు ఢీకొని మూడు ఏనుగులు మృతి

  • రైల్వే ట్రాక్ దాటుతున్న మూడు ఏనుగులను రైలు ఢీకొట్టింది
  • రైలు ఢీకొని మూడు ఏనుగులు మృతి
Elephant

Elephant

జార్ఖండ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొని మూడు ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. ఆగ్నేయ రైల్వే ఖరగ్‌పూర్ డివిజన్‌లోని సర్దిహా జార్గ్రామ్ సెక్షన్‌లోని 143 కిలోమీటరు వద్ద స్తంభం నంబర్ 11/13 మధ్య రైల్వే ట్రాక్ దాటుతున్న మూడు ఏనుగులను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు ఏనుగులు అక్కడికక్కడే చనిపోయాయి. మృతిచెందిన ఏనుగుల్లో ఒక పెద్ద ఏనుగు ఉండగా, రెండు పిల్ల ఏనుగులు ఉన్నాయి. ఈ సంఘటన రాత్రి 12:50 గంటలకు జరిగింది.

Also Read:Tirumala Rush: తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం.. రేపే అక్టోబర్ నెల టికెట్లు విడుదల

×
×
Ad

సంఘటన సమాచారం అందిన వెంటనే, రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. రైల్వే బృందం రాత్రిపూట సంఘటన జరిగిన ప్రదేశానికి బయలుదేరి సహాయక చర్యలు చేపట్టింది. చనిపోయిన ఏనుగుల మృతదేహాలను సంఘటనా స్థలం నుంచి తొలగించారు. అప్ లైన్ ను ఉదయం 6:15 గంటలకు, డౌన్ లైన్ ను ఉదయం 7:30 గంటలకు పునరుద్ధరించారు రైల్వే అధికారులు ఈసంఘటనపై రైల్వే ఖరగ్‌పూర్ డివిజన్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.