భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో స్టార్ బౌలర్లు సైతం వణికిపోతారు. సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి స్థాయిలో పరుగుల వరద పారించిన ఘనత కోహ్లీకే దక్కుతుంది. అయితే.. మైదానంలో ఎంతటి బౌలర్లనైనా అలవోకగా ఎదుర్కొనే ఈ రన్ మెషీన్ను కూడా కొందరు బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీనే ఒక సందర్భంలో అంగీకరించినట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉన్నాయి.
టెస్టుల్లో జేమ్స్ అండర్సన్..
సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టుల్లో ఇంగ్లాండ్ పేస్ గుర్రం జేమ్స్ అండర్సన్ను ఎదుర్కోవడం తనకు అత్యంత కఠినమైన సవాల్ అని కోహ్లీ భావించారు. ముఖ్యంగా 2014 నాటి ఇంగ్లాండ్ పర్యటనలో అండర్సన్ స్వింగ్ బౌలింగ్కు కోహ్లీ పదే పదే ఔటవుతూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వన్డేల్లో అదిల్ రషీద్..
పరిమిత ఓవర్ల క్రికెట్ (ODI) విషయానికి వస్తే.. ఇంగ్లాండ్కే చెందిన స్పిన్నర్ అదిల్ రషీద్ బౌలింగ్లో ఆడటం కోహ్లీకి అంత సులువు కాలేదు. వన్డేల్లో కోహ్లీని అత్యధికంగా ఐదుసార్లు అవుట్ చేసిన స్పిన్నర్గా రషీద్కు మంచి రికార్డు ఉంది.
టీ20ల్లో సునీల్ నరైన్..
పొట్టి ఫార్మాట్ లేదా ఐపీఎల్ మ్యాచ్లలో వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ను అంచనా వేయడం చాలా కష్టమని కోహ్లీ ఒప్పుకున్నారు. అలాగే శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ బౌలింగ్ శైలిని కెరీర్ ఆరంభంలో అర్థం చేసుకోవడం సవాల్గా అనిపించినా, ఆ తర్వాత అలవాటైపోయిందని కోహ్లీ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో కేవలం వన్డే ఫార్మాట్పైనే దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆయన టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికారు. లీగ్ క్రికెట్లో మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తరఫున ఐపీఎల్లో కొనసాగుతున్నారు. కోహ్లీని సైతం ముగ్గురు బౌలర్లు భయపెట్టారనే ఈ ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
