One Toilet in Junior College: కాలేజీలో ఒక్కటే టాయిలెట్.. 150 మంది విద్యార్థులకు నిత్యం నరకం..!
- మద్దూర్ ప్రభుత్వ కాలేజీలో 150 మంది విద్యార్థులు..
- 90 మంది అమ్మాయిలు.. 60 మంది అబ్బాయిల విద్యాభ్యాసం..
- కాలేజీలో ఒకటే టాయిలెట్.. ఇబ్బంది పడుతోన్న విద్యార్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
One Toilet in Junior College: ప్రైవేట్ విద్యాసంస్థల్లో కంటే.. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లోనే మంచి వసతులు ఉంటాయని.. ఆట స్థలాలు.. ఉంటాయని నిత్యం ప్రచారం చేస్తుంటుంది ప్రభుత్వం.. అయితే, ఆ కళశాలలో 150 మంది విద్యార్థులు ఉంటే.. అందులో ఉన్నది మాత్రం ఒక్కటే మరుగుదొడ్డి.. అది కూడా అమ్మాయిలకు, అబ్బాయిలకు కలిపి ఒక్కటే మరుగుదొడ్డి ఉంది.. వింటేనే ఏదోలా ఉన్న విద్యార్థినిలు మాత్రం నరకం అనుభవిస్తున్నారు. ఇది ఒక్క సిద్దిపేట జిల్లా మద్దూర్ ప్రభుత్వ కళాశాల పరిస్థితి కాదు మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళశాలలో ఇదే పరిస్థితి నెలకొని ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి..
Read Also: Uttarpradesh : ఓరయ్యా.. ఏంది రా ఇది.. డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడు.. నువ్వేమో రీల్స్ చూస్తున్నావ్
Also Read
- IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో 150 మంది విద్యార్థులు వున్నారు.. అందులో 90 మంది అమ్మాయిలు, 60 మంది అబ్బాయిలు చదువుకుంటున్నారు.. కానీ, అమ్మాయిలు మూత్రవిసర్జనకు వెళ్లాంటే.. ఒక్కటే మరుగుదొడ్డి ఉంది.. అది కూడా అద్వాన్నంగా ఉన్న తప్పని పరిస్థితుల్లో వాడుకుంటున్నారు.. ఉదయం సమయాన మూత్రవిసర్జనకు వెళ్లాలంటే అమ్మాయిలు జంకుతున్నారు.. క్యూలు కట్టి ఒకరి తరువాత ఒకరం వెళ్తున్నాం.. నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తు్నారు.. ఇక, అమ్మాయిలకే ఇబ్బందిగా ఉండడంతో.. అబ్బాయిలు చేసేది ఏమీలేక ఆరు బయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు.. అరుబయటకు వెళ్లినప్పుడు పాములు, తేళ్లు వంటి విష కీటకాల బారిన పడే ప్రమాదం లేకపోలేదు.. గంటల తరబడి మూత్రవిసర్జన ఆపుకోవడంతో విద్యార్థినిలలో మూత్ర సంబంధిత వ్యాధులు బారినపడుతున్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు విద్యారంగనికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ఆచరణలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు.. ఇప్పటికైనా జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు స్పందించి మద్దూర్ కళాశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తు్న్నారు విద్యార్థినులు.
తాజావార్తలు
-
IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
-
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
-
Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
-
Swapnalok Complex Fire : సికింద్రాబాద్లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!