One Toilet in Junior College: కాలేజీలో ఒక్కటే టాయిలెట్.. 150 మంది విద్యార్థులకు నిత్యం నరకం..!
- మద్దూర్ ప్రభుత్వ కాలేజీలో 150 మంది విద్యార్థులు..
- 90 మంది అమ్మాయిలు.. 60 మంది అబ్బాయిల విద్యాభ్యాసం..
- కాలేజీలో ఒకటే టాయిలెట్.. ఇబ్బంది పడుతోన్న విద్యార్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
One Toilet in Junior College: ప్రైవేట్ విద్యాసంస్థల్లో కంటే.. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లోనే మంచి వసతులు ఉంటాయని.. ఆట స్థలాలు.. ఉంటాయని నిత్యం ప్రచారం చేస్తుంటుంది ప్రభుత్వం.. అయితే, ఆ కళశాలలో 150 మంది విద్యార్థులు ఉంటే.. అందులో ఉన్నది మాత్రం ఒక్కటే మరుగుదొడ్డి.. అది కూడా అమ్మాయిలకు, అబ్బాయిలకు కలిపి ఒక్కటే మరుగుదొడ్డి ఉంది.. వింటేనే ఏదోలా ఉన్న విద్యార్థినిలు మాత్రం నరకం అనుభవిస్తున్నారు. ఇది ఒక్క సిద్దిపేట జిల్లా మద్దూర్ ప్రభుత్వ కళాశాల పరిస్థితి కాదు మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళశాలలో ఇదే పరిస్థితి నెలకొని ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి..
Read Also: Uttarpradesh : ఓరయ్యా.. ఏంది రా ఇది.. డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడు.. నువ్వేమో రీల్స్ చూస్తున్నావ్
Also Read
- Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- India vs Sri Lanka: ఒకప్పుడు భారత్కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో 150 మంది విద్యార్థులు వున్నారు.. అందులో 90 మంది అమ్మాయిలు, 60 మంది అబ్బాయిలు చదువుకుంటున్నారు.. కానీ, అమ్మాయిలు మూత్రవిసర్జనకు వెళ్లాంటే.. ఒక్కటే మరుగుదొడ్డి ఉంది.. అది కూడా అద్వాన్నంగా ఉన్న తప్పని పరిస్థితుల్లో వాడుకుంటున్నారు.. ఉదయం సమయాన మూత్రవిసర్జనకు వెళ్లాలంటే అమ్మాయిలు జంకుతున్నారు.. క్యూలు కట్టి ఒకరి తరువాత ఒకరం వెళ్తున్నాం.. నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తు్నారు.. ఇక, అమ్మాయిలకే ఇబ్బందిగా ఉండడంతో.. అబ్బాయిలు చేసేది ఏమీలేక ఆరు బయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు.. అరుబయటకు వెళ్లినప్పుడు పాములు, తేళ్లు వంటి విష కీటకాల బారిన పడే ప్రమాదం లేకపోలేదు.. గంటల తరబడి మూత్రవిసర్జన ఆపుకోవడంతో విద్యార్థినిలలో మూత్ర సంబంధిత వ్యాధులు బారినపడుతున్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు విద్యారంగనికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ఆచరణలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు.. ఇప్పటికైనా జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు స్పందించి మద్దూర్ కళాశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తు్న్నారు విద్యార్థినులు.
తాజావార్తలు
-
Lopamudra Raut Theft Case: బిగ్బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
-
iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
-
Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!