NTV Telugu Site icon

Robbery in Train: హుబ్లీ-విజయవాడ ప్యాసింజర్ రైలులో భారీ చోరీ

Train

Train

Robbery in Train: నంద్యాల జిల్లాలో హుబ్లీ-విజయవాడ ప్యాసింజర్ రైలులో భారీ చోరీ జరిగింది. రూ.3 కోట్ల విలువైన మూడున్నర కేజీల బంగారం, రూ 50 వేల నగదు అపహరణకు గురైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బళ్లారి , హోస్పేట్ ప్రాంతాల్లో బంగారు ఆభరణాలను అమ్మడానికి పల్నాడు జిల్లా సత్తెనపల్లె వ్యాపారులు రంగారావు , సతీష్ కుమార్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో హుబ్లీ-విజయవాడ ప్యాసింజర్ రైలులో నరసరావుపేటకు రంగారావు , సతీష్ కుమార్ బయలుదేరారు. మూడున్నర కిలోల బంగారు ఆభరణాలు, రూ 50 వేల నగదును బ్యాగ్‌లో పెట్టుకున్నారు. ఏసీ కోచ్‌లో వారిద్దరు నిద్రపోయారు. తెల్లవారుజామున 4 గంటలకు బ్యాగ్ ఉన్నట్లు నంద్యాలలో చూసుకున్నారు. రైలు దొనకొండ చేరేసరికి బంగారం, నగదు ఉన్న బ్యాగ్ మాయమైంది. నంద్యాల-గిద్దలూరు మధ్య బ్యాగ్‌ను ఆగంతకులు అపహరించారు. ఫోన్ ద్వారా నంద్యాల రైల్వే పీఎస్‌కు రంగారావు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

Read Also: Sajjala Ramakrishna Reddy: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సజ్జల కౌంటర్