Tonk Violence: హింసాకాండ.. బూడిదైన 100 వాహనాలు.. 60 మంది అదుపులో
- రాజస్థాన్లోని టోంక్ జిల్లా సమ్రావత గ్రామంలో.
- బుధవారం రాత్రి జరిగిన హింసాకాండతో ఉద్రిక్త వాతావరణం.
- బూడిదైన 100 వాహనాలు..
- 60 మంది అదుపులో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tonk Violence: రాజస్థాన్లోని టోంక్ జిల్లా సమ్రావత గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన హింసాకాండతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. గ్రామంతోపాటు పరిసర ప్రాంతాల్లో పోలీసు బృందాలు గస్తీ తిరుగుతున్నాయి. బుధ్రావ్ ఎమ్మెల్యే అభ్యర్థి నరేష్ మీనా మద్దతుదారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నరేష్ మీనా మద్దతుదారులు పోలీసులపై రాళ్లు రువ్వారని, అగ్నిప్రమాదం జరిగిందని ఆరోపించారు. దీంతో స్పందించిన పోలీసులు బాష్పవాయువు షెల్స్ను విడుదల చేసి దాదాపు 100 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇంతలో అగంతకులు బైక్లు, కార్లకు నిప్పు పెట్టారు. రాళ్లదాడిలో 100కు పైగా ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు దగ్ధమయ్యాయి. అదే సమయంలో నరేష్ మీనా మద్దతుదారులైన 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేష్ మీనాపై నాగర్కోట్ పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు 4 కేసులు నమోదయ్యాయి. ఈ హింసాత్మక ఘటనలో పలువురు గ్రామస్తులు కూడా గాయపడ్డారు.
Also Read: Tilak Varma: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. బద్దలైన రైనా రికార్డు !
Also Read
అసలు విషయమేమిటంటే.. రాజస్థాన్ లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. దేవల్ ఉనియారా సీటు కూడా వీటిలో ఒకటి. నరేష్ మీనా కూడా స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. కాగా, సంరవత గ్రామంలో ఓటింగ్ సందర్భంగా నరేష్ మీనా ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. ఈవీఎంలో తన ఎన్నికల గుర్తు అస్పష్టంగా ఉందని ఆరోపించారు. కాగా, పోలింగ్ బూత్ వద్ద ఏసీడీఎం అమిత్ చౌదరిని నరేష్ మీనా చెప్పుతో కొట్టారు. దీనిపై పోలీసులు నరేష్ మీనాను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా నరేష్ మీనా మద్దతుదారులు రాత్రి వేళలో రచ్చ సృష్టించారు. ఈ ఎన్నికలకు ముందు నరేష్ మీనా కాంగ్రెస్లో ఉన్నారని, అయితే పార్టీపై తిరుగుబాటు చేసి ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసారు.
Also Read: Childrens day 2024: నేటి బాలలే రేపటి పౌరులు.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు
హింసాకాండ ఘటన తర్వాత సమర్వాత గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. నిరసన జరుగుతున్న పోలింగ్ బూత్ వద్ద కవరేజీ కోసం స్థానిక జర్నలిస్టులు కూడా ఉన్నారు. హింస చెలరేగినప్పుడు, జర్నలిస్టులు పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. రాజస్థాన్లోని దౌసా, డియోలీ-ఉనియారా, ఝుంఝును, ఖిన్వ్సర్, చౌరాసి, సాలంబర్, రామ్గఢ్తో సహా ఏడు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న ఓటింగ్ జరిగింది. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.
https://twitter.com/Iambakshi/status/1856769306291208665
తాజావార్తలు
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
-
Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
-
Bhatti Vikramarka : తప్పుడు ప్రచారాలు మానండి.. రైతులకు ఉచిత కరెంట్ ఆగదు
-
‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
-
Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!