Tonk Violence: హింసాకాండ.. బూడిదైన 100 వాహనాలు.. 60 మంది అదుపులో
- రాజస్థాన్లోని టోంక్ జిల్లా సమ్రావత గ్రామంలో.
- బుధవారం రాత్రి జరిగిన హింసాకాండతో ఉద్రిక్త వాతావరణం.
- బూడిదైన 100 వాహనాలు..
- 60 మంది అదుపులో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tonk Violence: రాజస్థాన్లోని టోంక్ జిల్లా సమ్రావత గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన హింసాకాండతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. గ్రామంతోపాటు పరిసర ప్రాంతాల్లో పోలీసు బృందాలు గస్తీ తిరుగుతున్నాయి. బుధ్రావ్ ఎమ్మెల్యే అభ్యర్థి నరేష్ మీనా మద్దతుదారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నరేష్ మీనా మద్దతుదారులు పోలీసులపై రాళ్లు రువ్వారని, అగ్నిప్రమాదం జరిగిందని ఆరోపించారు. దీంతో స్పందించిన పోలీసులు బాష్పవాయువు షెల్స్ను విడుదల చేసి దాదాపు 100 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇంతలో అగంతకులు బైక్లు, కార్లకు నిప్పు పెట్టారు. రాళ్లదాడిలో 100కు పైగా ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు దగ్ధమయ్యాయి. అదే సమయంలో నరేష్ మీనా మద్దతుదారులైన 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేష్ మీనాపై నాగర్కోట్ పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు 4 కేసులు నమోదయ్యాయి. ఈ హింసాత్మక ఘటనలో పలువురు గ్రామస్తులు కూడా గాయపడ్డారు.
Also Read: Tilak Varma: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. బద్దలైన రైనా రికార్డు !
Also Read
- Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
- IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
అసలు విషయమేమిటంటే.. రాజస్థాన్ లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. దేవల్ ఉనియారా సీటు కూడా వీటిలో ఒకటి. నరేష్ మీనా కూడా స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. కాగా, సంరవత గ్రామంలో ఓటింగ్ సందర్భంగా నరేష్ మీనా ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. ఈవీఎంలో తన ఎన్నికల గుర్తు అస్పష్టంగా ఉందని ఆరోపించారు. కాగా, పోలింగ్ బూత్ వద్ద ఏసీడీఎం అమిత్ చౌదరిని నరేష్ మీనా చెప్పుతో కొట్టారు. దీనిపై పోలీసులు నరేష్ మీనాను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా నరేష్ మీనా మద్దతుదారులు రాత్రి వేళలో రచ్చ సృష్టించారు. ఈ ఎన్నికలకు ముందు నరేష్ మీనా కాంగ్రెస్లో ఉన్నారని, అయితే పార్టీపై తిరుగుబాటు చేసి ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసారు.
Also Read: Childrens day 2024: నేటి బాలలే రేపటి పౌరులు.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు
హింసాకాండ ఘటన తర్వాత సమర్వాత గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. నిరసన జరుగుతున్న పోలింగ్ బూత్ వద్ద కవరేజీ కోసం స్థానిక జర్నలిస్టులు కూడా ఉన్నారు. హింస చెలరేగినప్పుడు, జర్నలిస్టులు పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. రాజస్థాన్లోని దౌసా, డియోలీ-ఉనియారా, ఝుంఝును, ఖిన్వ్సర్, చౌరాసి, సాలంబర్, రామ్గఢ్తో సహా ఏడు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న ఓటింగ్ జరిగింది. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.
https://twitter.com/Iambakshi/status/1856769306291208665
తాజావార్తలు
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?