Diamonds Theft: సరుకు చూపించండి.. సర్దేసుకుంటాం

Diamonds

Diamonds

Diamonds Theft: గుజరాత్‌లోని ప్రముఖ వజ్రాల వ్యాపారిని మోసగించిన దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఆదివారం ప్రకటించింది. ఒక గుజరాత్ వజ్రాల వ్యాపారిని ముంబైకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఫిబ్రవరిలో సంప్రదించారు. వ్యాపారం కోసం పెద్ద మొత్తంలో వజ్రాలు కొంటామని అతడిని కోరారు. వారి వ్యూహాలను కనిపెట్టలేకపోయిన వ్యాపారి వారికి సరుకును చూపించడానికి అంగీకరించాడు. అప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు ఆ వ్యాపారి దగ్గర వజ్రాలు చూడడానికి గుజరాత్ వెళ్ళడానికి అంగీకరించారు.

Read Also: Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో ఆకలి కేకలు..ఇప్పటికే 20 మంది మృతి..50 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్భణం

ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట మధ్య ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ వజ్రాల వ్యాపారిని తనకు వజ్రాలు చూపించమని అడిగాడు. వ్యాపారి సంచిలోంచి వజ్రాలన్నీ తీసి వారి ముందు ఉంచాడు. ఆ సమయంలో ఈ ఇద్దరిలో ఒకరు టీ డిమాండ్ చేశారు. వెంటనే వ్యాపారి టీని ఆర్డర్ చేయడానికి పక్కకు వెళ్లాడు. దీనిని సద్వినియోగం చేసుకుని వజ్రాలను నకిలీ గాజు వజ్రాలతో మార్చి నిజమైన వజ్రాలను కొట్టేశారు. మళ్లీ వజ్రాలు కొనేందుకు వస్తామని చెప్పి అక్కడి నుంచి పరారయ్యారు.

Read Also: Fight For Land: భూతగాదా.. తాహశీల్దార్ ఎదుటే పిచ్చకొట్టుడు

వ్యాపారవేత్తకు కాసేపైన తర్వాత అసలు విషయం అర్థమైంది. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై గుజరాత్ పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడ సక్రమంగా కేసు నమోదు చేశారు. విచారణలో నిందితులు ముంబైకి పారిపోయినట్లు గుజరాత్ పోలీసులు గుర్తించారు. అనంతరం విచారణను ముంబై క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు. ముంబయి పోలీసులకు తమ రహస్య ఇన్‌ఫార్మర్ ద్వారా ఓ నిందితుడు కండివాలికి వస్తాడని సమాచారం అందింది. ఆ తర్వాత క్రైమ్ బ్రాంచ్ కందివలిలో ఒకరిని అరెస్టు చేశారు. ఆ తర్వాత రెండో నిందితుడు లాల్‌బాగ్‌కు వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడ మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ పోలీసుల నుంచి సమాచారం అందుకున్న ముంబై పోలీసులు కేవలం ఏడు గంటల్లోనే నిందితుడు దుకాలీని అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ కోసం నిందితుడిని గుజరాత్ పోలీసులకు అప్పగించారు.