Tiger Wandering: అలర్ట్.. దర్జాగా రోడ్డు దాటిన పెద్దపులి.. ఎక్కడంటే?
- జాతీయ రహదారిపై పులి
- నేరడిగొండ మండలం నిర్మల్ ఘాట్ సెక్షన్ పైన రోడ్డు దాటిన టైగర్
- . రోడ్డు పై దర్జాగా వెళ్తున్న పులిని చూసిన వాహనదారులు
- కెమెరాల్లో బంధించిన డ్రైవర్లు
- అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ రహదారిపై పులి కనిపించింది. నేరడిగొండ మండలం నిర్మల్ ఘాట్ సెక్షన్ పైన రోడ్డు దాటింది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల గుండా రోడ్డు దాటింది. రోడ్డు పై దర్జాగా వెళ్తున్న పులిని చూసిన వాహనదారులు.. హడలెత్తిపోయారు. కారు, లారీ లో ప్రయాణిస్తున్న డ్రైవర్లుసెల్ ఫోన్ కెమెరాల్లో బంధించారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కొద్ది రోజులుగా నిర్మల్ జిల్లాలో ఈ పులి సంచరిస్తోంది. కవ్వాల్ టైగర్ జోన్ వైపు దారి మళ్ళినట్లు సమాచారం. ఇస్ పూర్, గౌలిగూడ, చింతగూడ,లింగట్ల ,ఆరెపల్లి, వాంకిడి గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులి రాకతో ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నేరడి గొండ అటవీ శాఖ సిబ్బంది పులి కదలికలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తోంది.
READ MORE: Manipur : మణిపూర్లో మరోసారి చెలరేగిన హింస.. కాల్పులు, బాంబు దాడి.. ప్రతిస్పందించిన భద్రతా దళాలు
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
ఇదిలా ఉండగా.. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని పెద్ద ధర్మారం సమీపంలోకి శనివారం తెల్లవారుజామున పెద్దపులి వచ్చింది. దీంతో స్ధానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గత ఆదివారం మామిడిగూడెం పంచాయతీ గోండుగూడకు చెందిన చిత్రు అనే గిరిజన రైతుకు చెందిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేసి మూడు ఆవులను చంపిన విషయం తెలిసిందే. సురక్షిత ఆవాసం కోసం వెతుకుతూ మూడు రోజుల క్రితం పెద్దపల్లి కవ్వాల అభయారణ్యంలోకి వెళ్లినట్లు సమాచారం. శనివారం తెల్లవారుజామున పెద్ద ధర్మారం గ్రామానికి అతి సమీపంలోని రహదారిపై పులి అడుగులు కనిపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. పంటచేన్లలో కాపలా ఉన్న కొందరికి పెద్దపులి అరుపులు వినిపించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా పత్తి పంట చేతికి రావడంతో పులి భయంతో పత్తి తీసేందుకు కూలీలు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ముత్యంపల్లి అటవీ సెక్షన్ పరిధిలోని పెద్దపులి రావడంతో అటవీ శాఖ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అడవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని సూచించారు. పులిని గుర్తించేందుకు ట్రాకింగ్ కెమెరాలను సైతం ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. పులికి ఎలాంటి హానీ తలపెట్టకుండా ఉండేందుకు స్ధానిక అటవీ శివారు గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!