RR vs KKR: రాజస్థాన్-కోల్కతా మ్యాచ్.. వర్షం కారణంగా రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ అప్పటి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఈ క్రమంలో.. రాత్రి 10.30 గంటల వరకు వేచి చూశారు. ఒకానొక సమయంలో వర్షం కురవడం ఆగిన తర్వాత గ్రౌండ్ మొత్తాన్ని గ్రౌండ్ సిబ్బంది రెడీ చేశారు. దీంతో.. అంఫైర్లు కూడా మ్యాచ్ జరిపించేందుకు సిద్ధం చేశారు. కాగా.. ఈ క్రమంలో.. అంఫైర్లు టాస్ వేయించగా, కేకేఆర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
Also Read
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
అయితే.. ఇరుజట్లు మ్యాచ్ ఆడేందుకు రెడీ అవుతుండగా మళ్లీ వర్షం కురుస్తుంది. దీంతో.. అంఫైర్లు ఇరుజట్ల కెప్టెన్లను పిలిచి మ్యాచ్ సాగేలా లేదని చెప్పేశారు. దీంతో.. మ్యాచ్ రద్దు చేస్తున్నామని తెలిపారు. దీంతో.. రెండు టీమ్ లకు చెరో పాయింట్ ఇచ్చారు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ కొనసాగుతుండగా, రెండో స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. మూడో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉండగా, నాలుగో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది.
Doctor of Literature : పిల్లికి ‘డాక్టర్ ఆఫ్ లిటరేచర్’ బిరుదు.. దీని వెనుక ఆసక్తికరమైన కారణం ఇదే..!
కాగా.. మే 21న మంగళవారం క్వాలిఫైయర్ 1లో కోల్కతా నైట్ రైడర్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్తుంది. మే 22న బుధవారం రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఎలిమినేట్ అవుతుంది. ఆ తర్వాత క్వాలిఫైయర్ లో ఓడిన జట్టు ఎలిమినేటర్ విజేతతో మే 24వ తేదీన ఆడుతుంది. ఆ తర్వాత ఫైనల్ మే 26న చెన్నైలో జరుగనుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?