Lok Sabha Election Results 2024: ఆ 21 స్థానాల్లో గెలుపు..ఓటములకు దాదాపు 10 వేల ఓట్ల తేడా మాత్రమే..
లోక్సభ ఎన్నికల ఫలితాలు రాగానే కొన్ని పాత రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులు బయటకు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో, ఆరుగురు అభ్యర్థులు ఆల్ టైమ్ రికార్డు కంటే అత్యధిక తేడాతో విజయం సాధించారు. అయితే కౌంటింగ్ చివరి దశ వరకు గెలుపు లేదా ఓటమిని అంచనా వేయడం కష్టంగా ఉన్న అనేక స్థానాలు ఉన్నాయి. 21 గట్టి పోటీ ఉన్న స్థానాల్లో గెలుపు ఓటము మధ్య 10 వేల ఓట్లు లేదా అంతకంటే తక్కువ తేడా ఉంది. అలాంటి స్థానాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ) అభ్యర్థులు తొమ్మిది స్థానాల్లో గెలుపొందగా.. ప్రతిపక్ష ఇండియా బ్లాక్ 11 స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు.
READ MORE: Health Tips: లివర్ ని శుభ్ర పరిచేందుకు ఈ డ్రింక్స్ తాగండి..
Also Read
బీజేపీ నుంచి 8 మంది, శివసేన నుంచి ఒకరు 10 వేల లోపు ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇండియా బ్లాక్ గురించి మాట్లాడితే, అటువంటి 6 స్థానాల్లో కాంగ్రెస్ మరియు మూడు స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ గెలిచింది. ఎన్సీపీ (శరద్ పవార్), టీఎంసీ కూడా హోరాహోరీ పోటీలో ఒక్కో సీటు గెలుచుకుంది. మహారాష్ట్రలోని ఇండియా బ్లాక్ నార్త్ వెస్ట్ ముంబై లోక్సభ స్థానం నుంచి ఎన్డిఎ తరపున.. శివసేన (యుబిటి) అభ్యర్థులను నిలబెట్టింది. ఈ స్థానంపై గట్టి పోటీలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన రవీంద్ర దత్తారం వైకర్ ఉద్ధవ్ థాకరే పార్టీ శివసేన (యుబిటి)కి చెందిన అమోల్ గజానన్ కీర్తికర్పై 48 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఇదే అతి చిన్న విజయం. 10 వేల లోపు ఓట్ల తేడాతో గెలుపు ఓటములను నిర్ణయించిన స్థానాల్లో ఏడు ఎస్సీ-ఎస్టీలకు రిజర్వు చేయబడ్డాయి.
కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్లోని ఏకైక స్థానం చండీగఢ్ నుంచి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల కూటమి తరపున మనీష్ తివారీ పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మనీష్ 2504 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సంజయ్ టాండన్పై విజయం సాధించారు. యూపీలోని బన్స్గావ్ రిజర్వ్డ్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కమలేష్ పాశ్వాన్ 3150 ఓట్ల తేడాతో గెలుపొందారు. కమలేష్కు 4 లక్షల 28 వేల 693 ఓట్లు రాగా, కాంగ్రెస్కు చెందిన సాదల్ ప్రసాద్ 4 లక్షల 25 వేల 543 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. యూపీలోని ధౌరహర లోక్సభ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థి ఆనంద్ భదౌరియా 4449 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆనంద్ కు 4 లక్షల 43 వేల 743 ఓట్లు వచ్చాయి. బీజేపీకి చెందిన రేఖా వర్మ రెండో స్థానంలో నిలిచారు. రేఖకు 4 లక్షల 39 వేల 294 ఓట్లు వచ్చాయి. ఇలా 21 స్థానాల్లో 10 వేల లోపు మెజార్టీతోనే గెలిచారు.
తాజావార్తలు
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!