NTV Telugu Site icon

CM Review: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ముగిసిన సీఎం సమీక్ష..

Cm

Cm

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు. అన్ని ప్రాజెక్టుల కింద భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ చెల్లింపులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా.. పాలమూరు- రంగారెడ్డి తప్పా.. అన్ని ప్రాజెక్టులను 18 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టు వారిగా సూక్ష్మ స్థాయిలో స్టేటస్ రిపోర్ట్ తయారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు.

Read Also: Kejriwal: లిక్కర్ కేసులో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్‌షీటు దాఖలు.. కేజ్రీవాల్‌కు సమన్లు

మండలం, గ్రామ వారీగా ఆయకట్టు వివరాలను రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ ఉండాలన్నారు. ఆయా ప్రాజెక్టుల కింద కొత్త ప్రతిపాదనలను న్యాయపరమైన వివాదాలకు అవకాశం లేకుండా రూపొందించాలన్నారు. ప్రస్తుతం చేపట్టిన పనులంటిని పూర్తి చేయాలన్నారు. ప్రతి ప్రాజెక్ట్ పై 30 రోజులకు ఒకసారి సమీక్షిస్తానని.. అన్ని ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో సందర్శించి పూర్తి నివేదికలివ్వాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు.

Read Also: Kejriwal: లిక్కర్ కేసులో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్‌షీటు దాఖలు.. కేజ్రీవాల్‌కు సమన్లు