Wayanad: వయనాడు ఘటనలో 308కి చేరిన మృతుల సంఖ్య..చైనా ప్రధాని సంతాపం
- వయనాడ్లో సంభవించిన ప్రకృతి విపత్తు
- 308కి చేరిన మృతుల సంఖ్య
- కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
- 1300 మంది సైనికుల మోహరింపు
- ఘటనపై సంతాపం వ్యక్తం చేసిన చైనా ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని వయనాడ్లో సంభవించిన ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య 308కి చేరింది. ఇప్పటికీ చాలా మంది శిథిలాల కింద కూరుకుపోయినట్లు అంచనా. తప్పిపోయిన వారిని అన్వేషించేందుకు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. వయనాడ్లో రెస్క్యూ ఆపరేషన్ వివరాలను తెలియజేస్తూ.. రెస్క్యూ ఆపరేషన్ శరవేగంగా కొనసాగుతోందని కలెక్టర్ మేఘశ్రీ తెలిపారు. ఆదివారం..1300 మందికి పైగా సైనికులు సెర్చ్ ఆపరేషన్లో నిమగ్నమయ్యారు. వాలంటీర్లు కూడా రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమై ఉన్నారు. శనివారం రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమైన వాలంటీర్లు చిక్కుకుపోయారని, దీనిని దృష్టిలో ఉంచుకుని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. చురల్మల, ముండక్కైలో రాత్రి సమయంలో పోలీసులు గస్తీ నిర్వహించారని పేర్కొంది.
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
కొండచరియలు విరిగిపడిన ఈ రెండు ప్రాంతాల్లోనూ ఖాళీగా ఉన్న ఇళ్లలో చోరీ ఘటనలు వెలుగులోకి రావడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. పోలీసు అనుమతి లేకుండా, సహాయక చర్యల కోసం కూడా ఎవరూ ఈ ప్రాంతాల్లోకి ప్రవేశించడం నిషేధించబడింది. అనుమతి లేకుండా ఎవరైనా ఇళ్లలోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, శిథిలాల నుంచి ఇప్పటివరకు 215 మృతదేహాలు, 143 శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు . వీటిలో 98 మంది పురుషులు, 87 మంది మహిళలు, 30 మంది పిల్లల శరీరాలు, అవయవాలు ఉన్నాయి.
READ MORE:Shiva Stotra Parayanam: అష్టైశ్వర్యాలు చేకూరాలంటే ఈ స్తోత్ర పారాయణం చేయండి..
బాధితులకు చైనా ప్రధాని సంతాపం
వయనాడ్ కొండచరియలు విరిగిపడి మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ చైనా ప్రధాని లీ చియాంగ్ ప్రధాని నరేంద్ర మోడీకి సందేశం పంపారు. భారత్లోని చైనా రాయబారి జు ఫీహాంగ్ సోషల్ మీడియా పోస్ట్లో ఆగస్టు 3న కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రధాని మోడీకి సంతాప సందేశం పంపినట్లు ప్రధాని లీ చియాంగ్ తెలిపారు. మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తాజావార్తలు
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!