Nagarjuna Akkineni: నాగార్జునకు హైకోర్టులో ఊరట.. కూల్చివేతలు ఆపాలని కోర్టు ఉత్తర్వులు
- నాగార్జునకు హైకోర్టులో ఊరట
- కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
- ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna Akkineni: ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలపై అక్కినేని నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. అక్రమ కట్టడం పేరుతో తన కన్వెన్షన్ సెంటర్ ను ఇవాళ కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ అక్కినేని నాగార్జున హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ జరిపారు. ఈ క్రమంలోనే కూల్చివేతలు ఆపాలని జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నాగార్జునకు తాత్కాలిక ఊరట దక్కినట్లు అయింది.
Read Also: Nagarjuna: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్..
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
హైదరాబాద్ మాదాపూర్లో ఆయనకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను శనివారం ఉదయం హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కూల్చివేతలను ఆపాలంటూ నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఊరట లభించింది. గచ్చిబౌలిలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. తమ్మిడి కుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించడం వల్ల అక్రమ కట్టడంగా గుర్తించి కూల్చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై అక్కినేని నాగార్జున స్పందిస్తూ చట్టవిరుద్ధంగా చేపట్టిన కూల్చివేతల వ్యవహారం పై కోర్టులోనే తేల్చుకుంటానన్నారు. అన్నట్లుగానే హైకోర్టులో కూల్చివేతలు వెంటనే ఆపాలని పిటిషన్ దాఖలు చేశారు.
ఈ విషయంపై విచారణ జరిపిన జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం కూల్చివేతలపై హైడ్రా అధికారుల నుంచి వివరాలు తీసుకుంది. హైడ్రా అధికారుల వాదనపై సంతృప్తి చెందని ధర్మాసనం వెంటనే కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే కూల్చివేతలపై స్టే ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు దూకుడుగా వ్యవహరించి ఎన్ కన్వెషన్ ను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చేయడం సరికాదన్న నాగార్జున వాదనతో హైకోర్టు ఏకీభవించింది. దీనిపై తదుపరి విచారణను వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!