Site icon NTV Telugu

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీఎం రేవంత్ పై బీజేపీ కాసం వెంకటేశ్వర్లు పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ చేసిన వాఖ్యల గురించి నాంపల్లి స్పెషల్ కోర్టులో కేస్ వేశాడు కాసం వెంకటేశ్వర్లు. గతేడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో సీఎం ప్రసంగం వల్ల భాజపా పరువుకు భంగం కలిగిందని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. భాజపా రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల కోర్టు విచారిస్తున్న ఈ కేసును కొట్టివేయాలని రేవంత్‌రెడ్డి క్వాష్ పిటిషన్‌ దాఖలు చేయగా.. విచారణ జరిపిన హైకోర్టు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

Exit mobile version