తెలంగాణ కేబినెట్ భేటీ సచివాలయంలో ప్రారంభమైంది. వ్యవసాయం, రైతు సంక్షేమం ఎజెండాగా కేబినెట్లో ప్రధానంగా చర్చ నిర్వహించనున్నారు. రుణమాఫీపై కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుట్లు తెలుస్తోంది. 2023 డిసెంబర్ 9 నాటికి తీసుకున్న రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించిట్లు సమాచారం. రుణమాఫీ విధివిధానాలు, అందుకు అవసరమైన రూ.39 వేల కోట్ల నిధులు సమకూర్చుకోవడంపై కేబినెట్లో చర్చించారు. ఈ ఆగస్టు 15 నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.