Encounter: సిఆర్‌పిఎఫ్ క్యాంపుపై దాడి.. 11 మంది ఉగ్రవాదులు హతం

  • మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో..
  • CRPF సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో.
  • 11 మంది ఉగ్రవాదులు హతం.
Crpf

Crpf

Encounter: నేడు (నవంబర్ 11, 2024) మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో CRPF సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 11 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. అందిన సమాచారం ప్రకారం, ఎన్‌కౌంటర్ సమయంలో ఒక CRPF జవాన్ కూడా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. మణిపూర్‌లోని ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో సోమవారం ఉదయం మిలిటెంట్లు సమీప కొండ ప్రాంతాల నుండి అతనిపై కాల్పులు జరపడంతో ఒక రైతు గాయపడ్డాడు. ఇంఫాల్ లోయలో పనిచేస్తున్న రైతులపై కుకీ ఉగ్రవాదులు వరుసగా మూడో రోజు దాడి చేయడంలో భాగంగానే ఈ దాడి జరిగింది. భద్రతా బలగాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఎదురుకాల్పులు జరిపాయి. దాంతో అక్కడ చిన్నపాటి ఎన్ కౌంటర్ జరిగింది. గాయపడిన రైతును చికిత్స నిమిత్తం యాంగంగ్‌ పోక్పీ పీహెచ్‌సీ ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది.

Read Also: Finger Millet Ragulu: కాల్షియంకు కేరాఫ్ అడ్రెస్ రాగులు.. ఎలా తీసుకోవాలంటే

గత ఏడాది మే నుండి మణిపూర్‌లో కొనసాగుతున్న కుల హింస కారణంగా 200 మందికి పైగా మరణించారు. అంతేకాదు వేలాది మంది తమ ఇళ్లను వదిలి నిరాశ్రయులయ్యారు. ఇంఫాల్ లోయలోని మెయిటీ కమ్యూనిటీ, చుట్టుపక్కల కొండ ప్రాంతాలలో స్థిరపడిన కుకీ కమ్యూనిటీ మధ్య హింస జరుగుతోంది. మణిపూర్‌లో హింసాత్మక చరిత్ర జాతి, రాజకీయ సంఘర్షణలతో ముడిపడి ఉంది. రాష్ట్రంలోని కుకి, నాగా, మైతేయ్ వర్గాల మధ్య చాలా కాలంగా ఉద్రిక్తత నెలకొంది.

Read Also: Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు.. రష్యా వెల్లడి