SIR in Telangana: తెలంగాణలో ఈ నెల 25 నుంచి ఓటర్ల ప్రత్యేక ‘సమగ్ర సవరణ సర్వే’ (SIR) జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 15 నుంచి 24 వరకు మూడు దశలుగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. మొదటి దశలో సర్ సర్వే నిర్వహణ అధికారులు బిఎల్ఓలకు వారు చేపట్టాల్సిన బాధ్యతలు వంటి కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందిస్తారు.
జిల్లా ఎన్నికల అధికారుల వారిగా క్షేత్ర స్థాయిలో ఈ సన్నద్ధత కార్యక్రమాన్ని చేపడతారు. ఇక రెండో దశలో సర్ సర్వేలో డిఈఓ, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బిఎల్ఓ పర్యవేక్షకులు, బిఎల్ఓలకు శిక్షణ అందిస్తారు. మూడో దశలో సర్వేలో భాగంగా ఇంటింటికి అందించే ఎన్యుమరేషన్ పత్రాలని ముద్రిస్తారు. సన్నద్ధత ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు బిఎల్ఓలు సర్ సర్వేను నిర్వహిస్తారు. జూలై 31న ముసాయిదా జాబితాను ప్రదర్శించనున్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఫిర్యాదులు అభ్యంతరాల స్వీకరణ సందేహాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేస్తారు. వారి గుర్తింపు కార్డుల పరిశీలన ప్రక్రియలను చేపడతారు. అక్టోబర్ 1న ఓటర్ల తుది జాబితాను ప్రదర్శిస్తారు.

