Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు సంబంధించి గందరగోళం నెలకొంది. ఇంధన నిల్వలు నిండుకుంటున్నాయనే వార్తల నేపథ్యంలో వాహనదారులు బంకుల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ రద్దీని నియంత్రించడానికి , అందుబాటులో ఉన్న నిల్వలను అందరికీ సమానంగా పంపిణీ చేయడానికి పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కొన్ని కఠినమైన నిబంధనలను అమలులోకి తీసుకువచ్చాయి.
పెట్రోల్ బంకుల్లో ఇంధన లభ్యత తక్కువగా ఉండటంతో, యాజమాన్యాలు వాహనాల రకాన్ని బట్టి రేషన్ పద్ధతిని అమలు చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు.. బైక్లు లేదా స్కూటర్లకు కేవలం రూ. 200 విలువైన పెట్రోల్ను మాత్రమే పోస్తున్నారు. నాలుగు చక్రాల వాహనాలకు గరిష్టంగా రూ. 1,000 వరకు మాత్రమే ఇంధనాన్ని నింపుతున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లు, పెద్ద డబ్బాలు లేదా క్యాన్లలో పెట్రోల్ నింపడాన్ని పూర్తిగా నిషేధించారు. అత్యవసర పరిస్థితుల పేరుతో వచ్చే వారికి కూడా ఇంధనం నింపే ప్రసక్తే లేదని బంకు యజమానులు ఖరాఖండిగా చెబుతున్నారు.
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- Tamil Nadu: విజయ్కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇంధన కొరతపై స్పందిస్తూ ప్రజలు ఆందోళన చెందవద్దని కోరుతున్నారు. రాష్ట్రంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, ఇది కేవలం “కృత్రిమ కొరత” మాత్రమేనని వారు పేర్కొంటున్నారు. పెట్రోల్ నిల్వలను దాచిపెట్టి, బ్లాక్ మార్కెట్లో విక్రయించే వారిపై లేదా కావాలనే కొరత సృష్టించే బంకు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అగ్ని ప్రమాదాల దృష్ట్యా దుర్వినియోగాన్ని అరికట్టడానికి బాటిళ్లలో పెట్రోల్ విక్రయించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల వల్ల వాహనదారులు ఒకేసారి బంకుల వద్దకు రావడంతో “ప్యానిక్ బయింగ్” (భయంతో కొనుగోలు చేయడం) జరుగుతోంది. దీనివల్ల సాధారణంగా ఉండాల్సిన నిల్వలు కూడా వేగంగా ఖర్చయిపోతున్నాయి. అధికారులు సరఫరాను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నందున, ప్రజలు సంయమనం పాటించాలని .. అవసరమైన మేరకే ఇంధనాన్ని నింపుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఆంక్షలు తాత్కాలికమే అయినప్పటికీ, పరిస్థితి చక్కబడే వరకు వాహనదారులు సహకరించడం అవసరం.
తాజావార్తలు
-
CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
-
AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
-
Tamil Nadu: విజయ్కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?
-
TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
-
Spirit Release Date: సల్మాన్ ఖాన్ వర్సెస్ ప్రభాస్.. ‘స్పిరిట్’ డేట్ ఫిక్స్.. రూమర్స్ అన్నీ తుడిచిపెట్టేసిన మేకర్స్!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!