TG Parent Care Bill 2026: నేడే బిల్లు.. ఇక తల్లిదండ్రులను చూసుకోకపోతే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జీతాల్లో కోతలు పక్కా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Parent Care Bill 2026: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సమాజంలోని ఓ కీలక సమస్యకు స్వస్తి చెప్పేందుకు ముందడుగు వేసింది. తల్లిదండ్రులకు ఓ వయసు వచ్చాక పిల్లలే తోడుండాలి. కానీ.. ప్రస్తుతం చాలా మంది వయోవృద్ధులైన తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తున్నారు. ఈ విధనాన్ని రూపుమాపాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ, యోగక్షేమాల కోసం రాష్ట్రప్రభుత్వం బిల్లు సిద్ధం చేసింది. నేడు (శనివారం) అసెంబ్లీలో ‘తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు-2026’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుతో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు పొందుతున్న ఉద్యోగులు ఒకవేళ పేరెంట్స్ను పట్టించుకోకుంటే వారి జీతం నుంచి 15 శాతం కట్ చేసి తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేస్తారు. ఈ బిల్లు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రైవేటుసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం తల్లిదండ్రులను పట్టించుకోకుంటే తమ వేతనంలో నెలకు 15 శాతం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది.
READ MORE: Hardik Pandya: యాటిట్యూడ్ మాత్రమే కాదు.. మంచి మనసు ఉందని నిరూపించిన హార్దిక్ పాండ్య..!
Also Read
- Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ 'జీరా రైస్' ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
జిల్లాల్లో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారుల(జిల్లా కలెక్టరు)కు కారణాలు వివరిస్తూ దరఖాస్తు చేసుకుంటే ఆ అధికారి పరిశీలించి దరఖాస్తును పరిష్కరిస్తారు. తరువాత ఉద్యోగి వేతనం నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు భృతిగా అధికారి నిర్ణయిస్తారు. ఈ బిల్లు ప్రకారం.. ఎలాంటి ఆధారం లేని తల్లిదండ్రులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. తల్లి లేదా తండ్రి అవసరమైతే ఇద్దరూ జిల్లా స్థాయిలో ప్రభుత్వం నియమించిన అధికారితో చర్చించి దరఖాస్తు సమర్పించాలి. ఈ దరఖాస్తును పరిశీలించి 60 రోజుట్లోగా సమస్యను పరిష్కరిస్తారు. తరువాత ఉద్యోగి జీతం నుంచి నిర్దేశించిన మొత్తాన్ని మినహాయించి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఆదేశాలివ్వాలి. ఒక వేళ అధికారి పట్టించుకోకుంటే, సమస్యను గడువుల లోపు పరిష్కరించకుంటే మరో మార్గం సైతం ఉంది. రాష్ట్ర స్థాయిలోని హైకోర్టు విశ్రాంత జడ్జీ కమిషనర్గా వ్యవహరిస్తారు. ఆయనకు అప్పీలు చేసే అవకాశం ఉంది.
READ MORE: Amaravati Legal Status: అమరావతికి చట్టబద్ధత.. నేడే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..
తాజావార్తలు
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. రెండో ఈవెంట్కు ముఖ్య అతిథిగా నాగ చైతన్య ?
-
Infinix Hot 70 Pro: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో రిలీజ్.. డ్యూయల్ డిస్ప్లే, 144Hz స్క్రీన్, 6000mAh బ్యాటరీ
-
RAW NTR: ‘ఊరు–వాడ’ కార్యక్రమంపై ‘రా ఎన్టీఆర్’ కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!