Liquor Sales: ఏరులై పారుతున్న మద్యం.. 70% పెరిగిన బీర్ల అమ్మకాలు.. కానీ ఆదాయం మాత్రం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Sales: తెలంగాణ రాష్ట్రంలో మద్యం వినియోగం మునుపెన్నడూ లేని విధంగా కొత్త రికార్డులను సృష్టించింది. తాజాగా ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విక్రయాలు భారీగా పెరిగినప్పటికీ, ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయ వృద్ధి మాత్రం నామమాత్రంగానే ఉండటం గమనార్హం.
Lalit Modi: లూజర్, జోకర్.. సంజీవ్ గోయెంకాపై మండిపడ్డ ఐపీఎల్ సృష్టికర్త..!
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
గడిచిన ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 1, 2025 నుండి మార్చి 31, 2026వరకు) రాష్ట్రంలో బీర్ల వినియోగం ప్రభంజనం సృష్టించింది. అంతకుముందు ఏడాది 136 లక్షల కేసులుగా ఉన్న బీర్ విక్రయాలు, ఈసారి ఏకంగా 232 లక్షల కేసులకు చేరాయి. అంటే దాదాపు 70.29% వృద్ధి నమోదైంది. వీటితోపాటు భారతీయ తయారీ మద్యం విక్రయాలు కూడా 362 లక్షల కేసుల నుండి 414 లక్షల కేసులకు (14.59% వృద్ధి) పెరిగాయి. దీనితోమద్యం అమ్మకాల మొత్తం విలువ రూ. 29,440 కోట్ల నుండి రూ. 31,237 కోట్లకు చేరింది.
మద్యం విక్రయాల విలువ 6.11% పెరిగినప్పటికీ, ప్రభుత్వానికి వచ్చే నికర ఆదాయ వృద్ధి కేవలం 0.68% మాత్రమే నిలిచిపోయింది. దీనికి దారితీసిన ప్రధాన కారణాలను అబ్కారీ శాఖ ఇలా విశ్లేషించింది. దీనికి ముఖ్య కారణం మార్కెట్లోకి వచ్చిన రూ. 99 (180 మి.లీ) బాటిళ్లకు ఆదరణ పెరిగింది. సామాన్యులు తక్కువ ధర బ్రాండ్లను ఎంచుకోవడం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ. 442 కోట్ల ఆదాయం తగ్గింది. అలాగే ప్రముఖ బ్రాండ్ల ధరలను ప్రభుత్వం తగ్గించడంతో సగటు బాటిల్ ధర రూ. 180 నుండి రూ. 160కి పడిపోయింది. దీనివల్ల దాదాపు రూ. 972 కోట్ల మేర రాబడి తగ్గింది. వీటితోపాటు గత ఏడాది వచ్చిన రూ. 1,900 కోట్ల నాన్-రీఫండబుల్ ఫీజులు ఈసారి రాకపోవడం కూడా మొత్తం ఆదాయంపై ప్రభావం చూపింది.
Petrol Price Hiked: వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్పై రూ.137, డీజిల్పై రూ.184 పెంపు
గణాంకాలను పరిశీలిస్తే, విక్రయాల ద్వారా వచ్చే నేరుగా వచ్చే ఆదాయం రూ. 25,727 కోట్లకు (4.01% వృద్ధి) పెరిగింది. అయితే లైసెన్స్ ఫీజులు, ఇతర విభాగాల్లో ఆదాయం 19.37% పడిపోవడంతో, రాష్ట్ర ఖజానాకు చేరిన మొత్తం నికర ఆదాయం రూ. 28,846 కోట్ల నుండి కేవలం రూ. 29,042 కోట్లకు మాత్రమే పరిమితమైంది.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!