Liquor Sales: ఏరులై పారుతున్న మద్యం.. 70% పెరిగిన బీర్ల అమ్మకాలు.. కానీ ఆదాయం మాత్రం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Sales: తెలంగాణ రాష్ట్రంలో మద్యం వినియోగం మునుపెన్నడూ లేని విధంగా కొత్త రికార్డులను సృష్టించింది. తాజాగా ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విక్రయాలు భారీగా పెరిగినప్పటికీ, ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయ వృద్ధి మాత్రం నామమాత్రంగానే ఉండటం గమనార్హం.
Lalit Modi: లూజర్, జోకర్.. సంజీవ్ గోయెంకాపై మండిపడ్డ ఐపీఎల్ సృష్టికర్త..!
Also Read
- Story Board : అయోధ్య ఆలయంలో అసలేం జరిగింది..? రాముడి సాక్షిగా నిధులు దారిమళ్లాయా..?
- IPL Player: బిగ్షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్పై పోలీస్ కేసు..
- Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
- Hardik And Yashasvi: KKR కెప్టెన్గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్లోకి యశస్వి జైస్వాల్..?
గడిచిన ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 1, 2025 నుండి మార్చి 31, 2026వరకు) రాష్ట్రంలో బీర్ల వినియోగం ప్రభంజనం సృష్టించింది. అంతకుముందు ఏడాది 136 లక్షల కేసులుగా ఉన్న బీర్ విక్రయాలు, ఈసారి ఏకంగా 232 లక్షల కేసులకు చేరాయి. అంటే దాదాపు 70.29% వృద్ధి నమోదైంది. వీటితోపాటు భారతీయ తయారీ మద్యం విక్రయాలు కూడా 362 లక్షల కేసుల నుండి 414 లక్షల కేసులకు (14.59% వృద్ధి) పెరిగాయి. దీనితోమద్యం అమ్మకాల మొత్తం విలువ రూ. 29,440 కోట్ల నుండి రూ. 31,237 కోట్లకు చేరింది.
మద్యం విక్రయాల విలువ 6.11% పెరిగినప్పటికీ, ప్రభుత్వానికి వచ్చే నికర ఆదాయ వృద్ధి కేవలం 0.68% మాత్రమే నిలిచిపోయింది. దీనికి దారితీసిన ప్రధాన కారణాలను అబ్కారీ శాఖ ఇలా విశ్లేషించింది. దీనికి ముఖ్య కారణం మార్కెట్లోకి వచ్చిన రూ. 99 (180 మి.లీ) బాటిళ్లకు ఆదరణ పెరిగింది. సామాన్యులు తక్కువ ధర బ్రాండ్లను ఎంచుకోవడం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ. 442 కోట్ల ఆదాయం తగ్గింది. అలాగే ప్రముఖ బ్రాండ్ల ధరలను ప్రభుత్వం తగ్గించడంతో సగటు బాటిల్ ధర రూ. 180 నుండి రూ. 160కి పడిపోయింది. దీనివల్ల దాదాపు రూ. 972 కోట్ల మేర రాబడి తగ్గింది. వీటితోపాటు గత ఏడాది వచ్చిన రూ. 1,900 కోట్ల నాన్-రీఫండబుల్ ఫీజులు ఈసారి రాకపోవడం కూడా మొత్తం ఆదాయంపై ప్రభావం చూపింది.
Petrol Price Hiked: వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్పై రూ.137, డీజిల్పై రూ.184 పెంపు
గణాంకాలను పరిశీలిస్తే, విక్రయాల ద్వారా వచ్చే నేరుగా వచ్చే ఆదాయం రూ. 25,727 కోట్లకు (4.01% వృద్ధి) పెరిగింది. అయితే లైసెన్స్ ఫీజులు, ఇతర విభాగాల్లో ఆదాయం 19.37% పడిపోవడంతో, రాష్ట్ర ఖజానాకు చేరిన మొత్తం నికర ఆదాయం రూ. 28,846 కోట్ల నుండి కేవలం రూ. 29,042 కోట్లకు మాత్రమే పరిమితమైంది.
తాజావార్తలు
-
Pune Woman and Lover Arrested: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. నిందితులు సియా, చేతన్లకు 7 రోజుల పోలీసు కస్టడీ!
-
Sukumar : RC 17 ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి!
-
Chiranjeevi: నేషనల్ అవార్డ్ రానివ్వండి, రాకపోనివ్వండి
-
OTR : దేశ రాజధానిలో తెలంగాణకు కేర్ ఆఫ్ లేకుండా పోతుందా?
-
Chiranjeevi : కనుగుడ్డు పోవాల్సింది అన్నారు.. మా నాన్న మాటలే గుర్తొచ్చాయి!
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!