Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Floods Situation Worsens Heavy Rains Force School Closures Reservoir Gates Opened

Telangana Floods: తెలంగాణలో కొనసాగుతున్న వరద ఉధృతి.. ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవులు

Published Date :August 19, 2025 , 7:48 am
By Kothuru Ram Kumar
Telangana Floods: తెలంగాణలో కొనసాగుతున్న వరద ఉధృతి.. ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Telangana Floods: తెలంగాణలో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వరద పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రాజెక్టులు పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటి విడుదల జరుగుతుండగా, విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు రెండు గేట్లు, స్వర్ణ ప్రాజెక్టు ఒక్క గేటు ఎత్తి నీరు వదులుతున్నారు. జైనథ్‌లో 116.5 మి.మీ., కొమురం భీం వాంకిడిలో 113 మి.మీ., మంచిర్యాల బెల్లంపల్లిలో 57 మి.మీ., నిర్మల్ కుంటాలలో 29.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.

ఇక మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే.. జూరాల ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. అధికారులు 31 క్రెస్ట్ గేట్లు ఎత్తి 2.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 2.40 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లోగా నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 3.70 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో 26 గేట్లు ఎత్తి 3.98 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుత నీటి మట్టం 585.20 అడుగులు, నిల్వ 298.13 టీఎంసీలు. మరోవైపు మూసీ ప్రాజెక్టులో 8 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు.

Also Read

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
  • Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!

Dowry Harassment: వరకట్న వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య..!

అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌లో భారీ వరద ఉధృతి కొనసాగుతోంది. మొత్తం 85 గేట్లు ఎత్తి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5,79,860 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 3.20 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అధికారులు 35 గేట్లు ఎత్తి 3.26 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. కడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. అలాగే నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రస్తుత నీటి మట్టం 694.27 అడుగులు ఉండగా, 2 గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులో ఐదు గేట్లు ఎత్తి నీరు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 39,009, ఔట్‌ఫ్లో 43,466 క్యూసెక్కులు నమోదయ్యాయి. జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Crypto Scam : హైదరాబాద్‌లో క్రిప్టో కరెన్సీ మోసం.. నెక్ట్స్‌బిట్‌ యాప్ నిర్వాహకుడు అరెస్ట్

ఇకపోతే, ఏడు రోజులుగా ఏడు పాయల ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. సింగూరు గేట్లు ఎత్తడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తూ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టుకు ఎస్సారెస్పీ నుంచి 11 వేల క్యూసెక్కులు, ఎల్లంపల్లి నుంచి 3,150 క్యూసెక్కులు, మూలవాగు నుంచి 1,516 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రస్తుత నిల్వ 13.306 టీఎంసీలుగా ఉంది. తెలంగాణలో వర్షాలు, వరదలతో ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా నీటి విడుదలను నియంత్రితంగా కొనసాగిస్తున్నారు. పలు జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adilabad schools holiday
  • elangana rains
  • Heavy rainfall telangana
  • Jurala project
  • Kaleshwaram project

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions