Site icon NTV Telugu

KRMB : ఏపీ సర్కార్‌పై కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు..

Krmb

Krmb

ఏపీ ప్రభుత్వంపై కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డుకు తెలంగాణ సర్కార్‌ ఫిర్యాదు చేసింది. ఆర్డీఎస్(రాజోలి బండ డైవ‌ర్ష‌న్ స్కీమ్‌) కుడి కాల్వ ప‌నుల‌పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ తెలంగాణ ఈఎన్సీ ముర‌ళీధ‌ర్.. కేఆర్ఎంబీ చైర్మ‌న్‌కు లేఖ రాశారు. కేఆర్ఎంబీ ఆదేశాల‌కు విరుద్ధంగా ప‌నులు కొన‌సాగిస్తున్నార‌ని లేఖ‌లో పేర్కొన్నారు ఈఎన్సీ ముర‌ళీధ‌ర్. అనుమతి లేకున్నా ఆర్డీఎస్ కుడి కాల్వ ప‌నులు ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తోందని.. అయితే.. పనులు కొన‌సాగించ‌కుండా ఏపీని నిలువ‌రించాల‌ని ఈఎన్సీ ముర‌ళీధ‌ర్ కోరారు.

 

Exit mobile version