DGP Jitender Reddy: హైదారాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు.. కీలక ఆదేశాలు జారీ చేసిన డీజీపీ
- దాదాపు 120 దేశాల నుంచి కంటెస్టెంట్లు
- ఇప్పటివరకు 116 దేశాల కంటెస్టెంట్లు సమాచారం
- వివిధ ప్రాంతాల్లో గ్రూపుల వారీగా పర్యటనలు
- పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేయాలన్న డీజీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. డీజీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులతో డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ భద్రత ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా డీజీప మాట్లాడుతూ…. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఇటీవల పోలీసు అధికారులతో సమావేశమై తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత చేపట్టాలని తెలిపారన్నారు. దాదాపు 120 దేశాల నుంచి కంటెస్టెంట్లు రానున్నారని ఇప్పటివరకు 116 దేశాల కంటెస్టెంట్లు సమాచారం వచ్చిందన్నారు. దాదాపు నెలరోజుల పాటు వారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గ్రూపుల వారీగా పర్యటిస్తారని డీజీపీ అన్నారు. అతిథులు రాక శుక్రవారం నుంచి మొదలైందని మిస్ వరల్డ్ ప్రారంభ కార్యక్రమం ఈనెల 10వ తేదీన జరగనుందని తెలిపారు.
READ MORE: Sperm Count: వీర్యకణాల సమస్యతో ఇబ్బందులా..? కారణాలు ఇవేకావొచ్చు.. జాగ్రత్త సుమీ!
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
మిస్ వరల్డ్ షెడ్యూల్ లో భాగంగా ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం, నల్గొండ జిల్లాలోని బుద్ధవనం, మహబూబ్ నగర్ లోని పిల్లలమర్రి, వరంగల్ జిల్లా, హైదరాబాదులోని లాల్ బజార్, సెక్రటేరియట్ , రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదగిరిగుట్ట దేవాలయం, ఉప్పల్ స్టేడియం, పోచంపల్లి, రామోజీ ఫిలిం సిటీ, తదితర ప్రాంతాలను గ్రూపుల వారీగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పర్యటిస్తారని డీజీపీ తెలియజేశారు. ఆయా ప్రాంతాలను, కార్యక్రమాలను అనుసంధానం చేస్తూ కంట్రోల్ ను ఏర్పాటు చేయనున్నమన్నారు. భారీ స్థాయిలో జరగనున్న ఈ పోటీలకు ప్రారంభ వేదికను గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తుండగా ఫైనల్ పోటీలను ఈనెల 31వ తేదీన హైటెక్స్ లో నిర్వహించనున్నామన్నారు. భారతదేశంలోనే పోలీస్ పెర్ఫామెన్స్ లో ప్రథమ స్థానంలో నిలిచిన తెలంగాణ పోలీస్ శాఖ మిస్ వరల్డ్ పోటీలకు 120 దేశాల నుంచి వచ్చే కంటెస్టెంట్లకు, అతిథులకు పకడ్బందీగా భద్రత చర్యలు చేపట్టి సమర్థతను ప్రపంచంలో ఇతర దేశాలకు చాటి చెప్పాలని డీజీపీ ఆకాంక్షించారు.
READ MORE: MP Yusuf Pathan: ఒడిశాలో బెంగాలీ కార్మికులపై దాడి.. అమిత్ షాకు టీఎంసీ ఎంపీ లేఖ!
ఈనెల 12వ తేదీన నాగార్జునసాగర్ లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును కంటెస్టెంట్ లో కొందరు సందర్శిస్తారని, ఈనెల 13వ తేదీన లాల్ బజార్ , చౌమల్లా ప్యాలెస్ లను,మరికొందరు ఈనెల 14వ తేదీన వరంగల్ హెరిటేజ్ సందర్శన, రామప్ప ఆలయ సందర్శన, ఈనెల 15వ తేదీన యాదగిరి గుట్ట ఆలయ సందర్శన, అదే రోజున మరికొందరు పోచంపల్లిలో చేనేత వస్త్రాల తయారీని, ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకిస్తారని ఈనెల 16వ తేదీన హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంట్ కు హాజరవుతారని, అదే రోజున మరికొందరు పిల్లల మర్రి వృక్ష సందర్శన చేస్తారని, ఎకో పార్క్ సందర్శిస్తారని, ఈనెల 17వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే స్పోర్ట్స్ ఫైనల్ పోటీలలో పాల్గొంటారని, అదే రోజున మరికొందరు కంటెస్టెంట్లు రామోజీ ఫిలిం సిటీ సందర్శిస్తారని తెలిపారు. ఈనెల 18వ తేదీన మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లు తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శిస్తారని, మరికొందరు కంటెస్టెంట్లు సచివాలయం పరిశీలిస్తారు. ఈనెల 20 తేదీన ఉప్పల్ స్టేడియంలో 21వ తేదీన శిల్పారామం లను సందర్శిస్తారు. ఈనెల 31వ తేదీన మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు జరుగుతాయని డీజీపీ అన్నారు. శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్ , అడిషనల్ డీజీపీ, మిస్ వరల్డ్ పోటీలకు పోలీస్ నోడల్ ఆఫీసర్ స్టీఫెన్ రవీంద్ర, డీజీ ఫైర్ సర్వీసెస్ నాగిరెడ్డి, హైదరాబాద్ అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, ఇంటెలిజెన్స్ ఐజీపీ కార్తికేయ, హైడ్రా కమిషనర్ రంగనాథ్ , టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రకాష్ రెడ్డి, మల్టీ జోన్ల ఐజీపీలు చంద్రశేఖర్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?