Telangana Congress : కాసేపట్లో గాంధీభవన్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాసేపట్లో గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ కానుంది. టీపీసీసీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమవేశానికి ఏఐసీసీ కార్యదర్శులు హాజరుకానున్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శులకు పని విభజన చేసే అవకాశం ఉంది. నియోజక వర్గాల బాధ్యత అప్పగించే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా.. జనవరి 26 తర్వాత నియోజకవర్గస్థాయిలో పాదయాత్రలు చేయాలన్నది ఏఐసీసీ నిర్ణయం. అయితే.. దీనిపై జిల్లా అధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ కమిటీతో సమావేశం నిర్వహిస్తోంది పీసీసీ. పార్టీ సీనియర్ నాయకులు గాంధీభవన్లో జరిగే సమావేశానికి హాజరుకాబోమని ప్రకటించారు. ఏఐసీసీ ఇచ్చిన సర్యులర్ మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా పీసీసీ ప్రకటించింది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్లో పరిణామాలపై అధిష్టానం దృష్టి సారించింది. సమస్య పరిష్కారం కోసం సీనియర్లను ఢిల్లీ రావాలంటూ కబురు పెట్టింది. దీంతో రేవంత్ రెడ్డి విషయంలో తాడోపేడో తేల్చుకునే దిశగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు సిద్ధమయ్యారు.
Also Read : Congress Ex MLA Anil Kumar: పార్టీని బలి చేయకండి.. రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు
తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ కమిటీలు రగిల్చిన చిచ్చు పతాకస్థాయికి చేరకుంది. సీనియర్లలలో ఇప్పటికే చాలా మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిన్న హైదరాబాద్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సీనియర్లు సమావేశమై చర్చించారు. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి, జగ్గారెడ్డి, కోదండరెడ్డి, మహేశ్వర్రెడ్డి వంటి నేతలు హాజరై తాజా పరిస్థితులపై చర్చించారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం చేసిన వలస వచ్చినవారికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ను కాపాడుతున్న తమపై కోవర్టులంటూ సోషల్ మీడియాలో ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!