Telangana Congress : కాసేపట్లో గాంధీభవన్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాసేపట్లో గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ కానుంది. టీపీసీసీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమవేశానికి ఏఐసీసీ కార్యదర్శులు హాజరుకానున్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శులకు పని విభజన చేసే అవకాశం ఉంది. నియోజక వర్గాల బాధ్యత అప్పగించే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా.. జనవరి 26 తర్వాత నియోజకవర్గస్థాయిలో పాదయాత్రలు చేయాలన్నది ఏఐసీసీ నిర్ణయం. అయితే.. దీనిపై జిల్లా అధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ కమిటీతో సమావేశం నిర్వహిస్తోంది పీసీసీ. పార్టీ సీనియర్ నాయకులు గాంధీభవన్లో జరిగే సమావేశానికి హాజరుకాబోమని ప్రకటించారు. ఏఐసీసీ ఇచ్చిన సర్యులర్ మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా పీసీసీ ప్రకటించింది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్లో పరిణామాలపై అధిష్టానం దృష్టి సారించింది. సమస్య పరిష్కారం కోసం సీనియర్లను ఢిల్లీ రావాలంటూ కబురు పెట్టింది. దీంతో రేవంత్ రెడ్డి విషయంలో తాడోపేడో తేల్చుకునే దిశగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు సిద్ధమయ్యారు.
Also Read : Congress Ex MLA Anil Kumar: పార్టీని బలి చేయకండి.. రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు
తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ కమిటీలు రగిల్చిన చిచ్చు పతాకస్థాయికి చేరకుంది. సీనియర్లలలో ఇప్పటికే చాలా మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిన్న హైదరాబాద్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సీనియర్లు సమావేశమై చర్చించారు. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి, జగ్గారెడ్డి, కోదండరెడ్డి, మహేశ్వర్రెడ్డి వంటి నేతలు హాజరై తాజా పరిస్థితులపై చర్చించారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం చేసిన వలస వచ్చినవారికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ను కాపాడుతున్న తమపై కోవర్టులంటూ సోషల్ మీడియాలో ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు.
Also Read
- Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
- Telangana Public School: విద్యా విప్లవానికి నాంది.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.!
- Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
- Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
తాజావార్తలు
-
Vivo T5 Lite 5G: వివో T5 Lite 5G త్వరలో భారత్లోకి.. 6,500mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
-
Obsession : ఇండియాలో అబ్సెషన్ కలెక్షన్ల సునామీ… కన్జ్యూరింగ్ రికార్డ్స్ బ్రేక్
-
RBI Young Professionals Recruitment 2026: ఆర్బీఐలో జాబ్స్.. నెలకు రూ.1.5 లక్షల స్టైపెండ్.. అర్హతలు, దరఖాస్తు వివరాలివే
-
Telangana Public School: విద్యా విప్లవానికి నాంది.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.!
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?