తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ తొలి బడ్జెట్ ను ఇవాళ ప్రవేశ పెట్టనుంది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కాగా, మండలిలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ ఇదే.. సుమారు 2.75 లక్షల కోట్ల వరకు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.