NTV Telugu Site icon

Tejashwi Yadav: ‘గుజరాతీలు దుండగులు’ అనే వ్యాఖ్యపై తేజస్వి యాదవ్‌కు కోర్టు సమన్లు

Tejashwi Yadav

Tejashwi Yadav

Tejashwi Yadav: ‘గుజరాతీలు దుండగులు’ అంటూ బీహార్‌ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ పరువు నష్టం కేసుకు సంబంధించి అహ్మదాబాద్‌లోని మెట్రోపాలిటన్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ డీజే పర్మార్ సెప్టెంబర్ 22న విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ తేజస్వీ యాదవ్‌కు సమన్లు జారీ చేశారు. క్రిమినల్ పరువు నష్టం కలిగించే భారతీయ శిక్షాస్మృతిలోని 499, 500 సెక్షన్‌ల కింద దాఖలు చేసిన ఫిర్యాదుపై ఈ ఉత్తర్వు వచ్చింది.

Read Also: Mamata Banerjee: లోక్‌సభ ఎన్నికలపై దీదీ కీలక వ్యాఖ్యలు.. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే…

‘సామాజిక కార్యకర్త’, వ్యాపారవేత్త హరేష్ మెహతా (69) ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. తాను వ్యాపారవేత్తనని, ఆల్ ఇండియా యాంటీ కరప్షన్ అండ్ క్రైమ్ ప్రివెంటివ్ కౌన్సిల్ (గుజరాత్ రాష్ట్రం) వైస్ ప్రెసిడెంట్‌ను అని ఆయన తెలిపారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 202 ప్రకారం తేజస్వీ యాదవ్‌పై కోర్టు విచారణ చేపట్టింది. అహ్మదాబాద్‌లో ఉన్న సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త అయిన హరేష్ మెహతా దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా తేజస్వీ యాదవ్‌కు సమన్లు ఇవ్వడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 21న బీహార్‌లోని పాట్నాలో తేజస్వీ యాదవ్ మీడియా ముందు చేసిన ప్రకటనకు సంబంధించిన రుజువుతో సహా హరేష్ మెహతా కోర్టులో తన ఫిర్యాదును దాఖలు చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్నందున తేజస్వీ యాదవ్ ఆ మాటలు అనరాదని మెహతా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.