Bihar Elections 2025: మహిళలకు 30 వేలు, రైతులకు ఉచిత విద్యుత్.. తేజస్వి యాదవ్ వరాల జల్లు!
- తేజస్వి యాదవ్ వరాల జల్లు
- రైతులకు పెద్ద ఎత్తున వాగ్దానాలు
- మహిళలకు 30 వేలు, వడ్డీ మాఫీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025 అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ ప్రజలపై ఆర్జేడీ నేత, మహా కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ వరాల జల్లు కురిపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు రూ.30,000 ఒకేసారి ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలానే రైతులకు పెద్ద ఎత్తున వాగ్దానాలు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్, వరిపై 300 రూపాయలు, గోధుమలపై 400 రూపాయలు బోనస్ అందిస్తామని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రచారం చివరి దశకు చేరుకున్న సందర్భంగా తేజస్వి యాదవ్ ఈరోజే విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
మీడియా సమావేశంలో తేజస్వి యాదవ్ మాట్లాడుతూ… ‘మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మకర సంక్రాంతి (జనవరి 14) నాడు మై బెహెన్ స్కీమ్ కింద మహిళల ఖాతాల్లోకి 30,000 రూపాయలు డిపాజిట్ చేస్తాం. మహిళలకు ఆర్థికంగా సాధికారత కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం. జీవికా దీదీ వంటి కమ్యూనిటీ మొబిలైజర్లను పర్మినెంట్ చేసి రూ.30,000 గౌరవ వేతనం ఇస్తాం. జీవికా దీదీ కేడర్కు నెలకు రెండు వేల రూపాయలు అందిస్తాము. ఐదు లక్షల రూపాయల బీమా, వడ్డీ మాఫీ కూడా చేస్తాం’ అని హామీ ఇచ్చారు.
Also Read
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
తేజస్వి యాదవ్ ఉద్యోగులకు అనేక వాగ్దానాలు చేశారు. తన ప్రభుత్వం ఏర్పడితే పాత పెన్షన్ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తలు సహా ఇతర ఉద్యోగుల బదిలీలు అండ్ పోస్టింగ్లు వారి సొంత జిల్లాల నుంచి 70 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం PACSలకు గౌరవ హోదా ఇస్తుందని, వారి గౌరవ వేతనాన్ని పరిశీలిస్తుందని కూడా తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో నవంబర్ 6న 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ప్రచారం రోజు సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ప్రచారం ముగిసే ముందు తేజస్వి యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించి కీలక హామీలు ఇచ్చారు.
తాజావార్తలు
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
-
West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
-
Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!