NTV Telugu Site icon

IND vs NZ: టీమిండియా ఆలౌట్.. స్వల్ప ఆధిక్యంలో భారత్

Nz

Nz

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా అద్భుతంగా రాణించింది. కాగా.. 462 పరుగులకు భారత్ ఆలౌటైంది. ఈరోజు 3 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ అద్భుతంగా ఆడారు. దీంతో.. భారత్ 107 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. సర్ఫరాజ్ ఖాన్ (150), పంత్ (99) పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ నిలకడగా ఆడి పరుగుల పట్టికను పరుగులు పెట్టించారు. అయితే.. ఒక్క పరుగు తేడాతో పంత్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. వీరిద్దరూ పెవిలియన్ బాట పట్టగానే టీమిండియా బ్యాటర్లు ఇలా వచ్చి అలా పెవిలియన్ కు వెళ్లిపోయారు. మధ్యాహ్నం నుంచి టీమిండియా 7 వికెట్లు కోల్పోయింది. అయితే.. న్యూజిలాండ్ విజయానికి 107 పరుగులు అవసరం.. ఈ రన్స్ కొట్టకుండా రోహిత్ సేన ఎలా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.

Read Also: Indian Railways: రైల్వేలో సిబ్బంది కొరత.. రిటైర్డ్ ఉద్యోగులకు లక్కీ ఛాన్స్!

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటర్లు యశస్వీ జైస్వాల్(35), రోహిత్ శర్మ (52), విరాట్ కోహ్లీ (70), సర్ఫరాజ్ ఖాన్ (10), రిషబ్ పంత్ (99), కేఎల్ రాహుల్ (12), జడేజా (5), అశ్విన్ (15), కుల్దీప్ యాదవ్ (6), సిరాజ్, బుమ్రా డకౌట్ అయ్యారు. న్యూజిలాండ్ బౌలింగ్‌లో మ్యాట్ హెన్రీ, విలియం ఓ రూర్కే చెరో 3 వికెట్లతో చెలరేగారు. ఆ తర్వాత.. అజాజ్ పటేల్ 2 వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌథీ, గ్లేన్ ఫిలిప్స్ తలో వికెట్ సంపాదించారు.

Read Also: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌కి రాష్ట్ర హోదా.. కేబినెట్ తీర్మానానికి ఎల్‌జీ ఆమోదం..