TDP-Janasena Meeting: ఇవాళ టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ – పీఏసీ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు విజయవాడలో టీడీపీ-జనసేన ఉమ్మడి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ముందు ఇవాళ టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ – పీఏసీ భేటీ కానుంది. తాజా రాజకీయ పరిణామాలపై టీడీపీ- పీఏసీ భేటీలో చర్చించనున్నారు. ఇక, రేపటి జేఏసీ సమావేశానికి టీడీపీ- పీఏసీ అజెండా ఖరారు చేయనున్నారు. చంద్రబాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరుగుతున్న తీరుపై చర్చ జరుగనుంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వంపై పోరాడాల్సిన అంశాలపై ప్రధానంగా టీడీపీ-పీఏసీలో చర్చించనున్నారు.
Read Also: Chandrababu: ఇసుక స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్
Also Read
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
ఇక, విజయవాడలోని జరిగే ఈ మీటింగ్ కి నారా లోకేష్తో పాటు జేఏసీలోని 12 మంది సభ్యులు హాజరవుతారు. అయితే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి రావడం లేదు. ఈ భేటీలో కీలక అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. గత భేటీలో మేనిఫెస్టోపై పవన్-లోకేష్ మధ్య చర్చ జరిగింది. ఆ తర్వాత ఇటీవల చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కూడా మేనిఫెస్టో విడుదలపైనే ఎక్కువగా చర్చించినట్లు తెలుస్తుంది.
Read Also: Telangana Rains: ఈశాన్య రుతుపవనాల ఎఫెక్ట్.. తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు
అయితే, రేపు జరిగే ఈ సమావేశంలో మేనిఫెస్టోకు టీడీపీ-జనసేన తుదిరూపు తీసుకు వచ్చే అవకావం ఉంది. ఇప్పటికే సూపర్ సిక్స్తో పాటు మరికొన్ని అంశాలతో టీడీపీ ప్రతిపాదనలు రెడీ చేయగా.. మరోవైపు జనసేన కూడా షణ్ముక వ్యూహం పేరుతో ఆరు అంశాలను ప్రతిపదించింది. రెండు పార్టీల నుంచి ఉన్న ప్రతిపాదనలపై చర్చించిన తర్వాత మేనిఫెస్టోపై ఓ క్లారిటికీ రానున్నట్లు సమాచారం. త్వరలో పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల దిశగా రెండు పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇక రేపు జరిగే మీటింగ్ లో రైతుల సమస్యలపై కూడా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న కరువు, రైతులను ఆదుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా టీడీపీ-జనసేన పార్టీలు ఓ కార్యాచరణ రూపొందించనున్నట్లు టాక్ వినిపిస్తుంది.
తాజావార్తలు
-
Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..