Chandrababu: తుఫాన్ కారణంగా రైతులంతా నష్టపోయారు.. ఎక్కడ చూసినా హృదయ విదారకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: తుఫాన్ కారణంగా రైతులంతా నష్టపోయారని.. ఎక్కడ చూసినా హృదయ విదారకంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. పర్చూరు మండలం చెరుకూరు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆయన.. గతంలో టీడీపీ ప్రభుత్వంలో వచ్చిన తుఫానులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు. మురికి కాలువలో మురికి తీయాలన్న బుద్ధి, జ్ఞానం ప్రభుత్వానికి ఉండాలన్నారు. రైతులకు గోతాలు కూడా ఇవ్వలేని అసమర్ధ ప్రభుత్వం ఇది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వచ్చి గాల్లో తిరిగి గాల్లోనే వెళ్లిపోయాడని విమర్శలు గుప్పించారు.
Read Also: RK Roja: తెలంగాణకు, ఆంధ్రాకు ఎటువంటి సంబంధం లేదు.. జగనన్నే వన్స్ మోర్..
Also Read
ఒక వ్యక్తి అహంకారానికి రైతులు బలైపోయారని ఆయన పేర్కొన్నారు. నిన్న ఒక్కరోజే నలుగురు రైతుల ఆత్మహత్య చేసుకున్నారని.. ఎగువన ప్రాజెక్టులు కట్టడం వల్ల కృష్ణా నదిలో నీళ్లు తగ్గాయన్నారు. గత ప్రభుత్వంలో పట్టిసీమ ద్వారా నీళ్లు ఇచ్చి సస్యశ్యామలం చేశామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క రోడ్డు బాగుందా.. అన్ని వ్యవస్థలు నాశనం చేశాడని ఆయన మండిపడ్డారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు మళ్లీ కొట్టుకుపోయింది.. గుండ్లకమ్మ గేటు కూడా కాపాడలేని ముఖ్యమంత్రి దద్దమ్మ ఉపన్యాసాలు చేస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి ఎవరు కారణం అంటూ ఆయన ప్రశ్నించారు.
అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది ఎవరు కారణం అని అడుగుతున్నామన్నారు. గేట్లు రిపేరు చేయలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట అంటూ ఎద్దేవా చేశారు. రెండు టీఎంసీల నీళ్లు గుండ్లకమ్మ నుంచి సముద్రంలోకి వెళ్లాయి అది నా బాధ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇసుక పైన ఉన్న ప్రేమ రైతులపై, అభివృద్ధిపై లేదన్నారు. రైతుల బాధ పట్టించుకోని ముఖ్యమంత్రిని దేవుడు ఎలా క్షమిస్తాడని.. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన నష్టపరిహారాన్ని కూడా తగ్గించి ఇస్తున్నారన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. ఎన్ని చెప్పినా ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి సిగ్గు లేకుండా పోయిందన్నారు. రైతులు తరపున న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చంద్రబాబు తెలిపారు. రైతు రాజ్యం తీసుకురావడానికి టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయన్నారు. ప్రజల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. తుపాను కారణంగా భారీ నష్టం జరిగితే ముఖ్యమంత్రి కేంద్రాన్ని సాయం కూడా అడగలేదన్నారు. ఏపీకి సాయం కోసం ప్రధానికి నేనే లేఖ రాస్తానని చంద్రబాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!