Tandoori roti: తందూరీ రోటీ బ్యాన్.. రూల్స్ అతిక్రమిస్తే రూ.5లక్షల జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tandoori roti: తందూరీ రోటీని ఇష్టంగా తినేవారికి ఓ చేదు వార్త. ఇకపై తందూరీ రోటీ దొరకదు. ఎందుకంటే ప్రభుత్వమే తందూరీ రోటీని బ్యాన్ చేసింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. మధ్యప్రదేశ్లో నివసిస్తున్న తందూరీ రోటీ ప్రియులకు ప్రభుత్వం ఈ చేదువార్త తెలిపింది. ఇకపై భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలియర్లలో తందూరి రోటీ అందుబాటులో ఉండదు. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తందూరీ రోటీని నిషేధించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.5 లక్షల రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకారం.. రాష్ట్రంలోని అనేక నగరాల్లో వాయు కాలుష్యం వేగంగా విస్తరిస్తోంది. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మధ్యప్రదేశ్ ఆహార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని హోటల్, దాబా నిర్వాహకులు తందూరీ రోటీ తయారీని నిలిపివేయాలని ఆహార శాఖ నోటీసులు జారీ చేసింది. తందూరీ రోటీని తయారు చేసేందుకు ప్రత్యేక పరికరాలను వినియోగిస్తారు. చెక్కతో తయారు చేసిన డ్రమ్లో బొగ్గుని మండిస్తూ వీటిని తయారు చేస్తారు. బొగ్గు అధికంగా వినియోగించడం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో పొగ కమ్ముకుని వాతావరణం కాలుష్యమవుతోంది. అందుకే వీటిపై నిషేధం విధించింది ప్రభుత్వం. ఎలక్ట్రిక్ ఓవెన్ లేదా ఎల్పీజీ గ్యాస్లను మాత్రమే వినియోగించాలని అధికారులు ఆదేశించారు. మధ్యప్రదేశ్లోని వారికి తందూరీ రోటీ చాలా ఇష్టమైన వంటకం. అక్కడి వారు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ సర్కారు తందూరీ రోటీని బ్యాన్ చేయడం వల్ల ఉసూరుమంటున్నారు.
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
Husband Lifts Wife Body: కన్నీళ్లు తెప్పించే హృదయ విదారక ఘటన.. భార్య శవాన్ని మోస్తూ..
హోటళ్లు, దాబాల నిర్వహణకు ఇప్పుడు కలప-బొగ్గును కాల్చి తందూరీ రోటీ తయారు చేయడం నిషేధమని ఆహార శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. బదులుగా ఎలక్ట్రిక్ ఓవెన్ లేదా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ను ఉపయోగించాలని కూడా సూచించబడింది. రాష్ట్రంలోని ప్రజలు తందూరీ రోటీని చాలా ఇష్టపడుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఈ నోటిఫికేషన్ తర్వాత తందూరీ రోటీ ప్రియులు నిరాశకు గురయ్యారు. అలాగే, ఈ ఆర్డర్ దాబా-హోటల్ యజమానులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రభుత్వ ఆదేశాలతో వ్యాపారం దెబ్బతింటుందని దాబా యజమానులు భయపడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!