Tandoori roti: తందూరీ రోటీ బ్యాన్.. రూల్స్ అతిక్రమిస్తే రూ.5లక్షల జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tandoori roti: తందూరీ రోటీని ఇష్టంగా తినేవారికి ఓ చేదు వార్త. ఇకపై తందూరీ రోటీ దొరకదు. ఎందుకంటే ప్రభుత్వమే తందూరీ రోటీని బ్యాన్ చేసింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. మధ్యప్రదేశ్లో నివసిస్తున్న తందూరీ రోటీ ప్రియులకు ప్రభుత్వం ఈ చేదువార్త తెలిపింది. ఇకపై భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలియర్లలో తందూరి రోటీ అందుబాటులో ఉండదు. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తందూరీ రోటీని నిషేధించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.5 లక్షల రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకారం.. రాష్ట్రంలోని అనేక నగరాల్లో వాయు కాలుష్యం వేగంగా విస్తరిస్తోంది. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మధ్యప్రదేశ్ ఆహార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని హోటల్, దాబా నిర్వాహకులు తందూరీ రోటీ తయారీని నిలిపివేయాలని ఆహార శాఖ నోటీసులు జారీ చేసింది. తందూరీ రోటీని తయారు చేసేందుకు ప్రత్యేక పరికరాలను వినియోగిస్తారు. చెక్కతో తయారు చేసిన డ్రమ్లో బొగ్గుని మండిస్తూ వీటిని తయారు చేస్తారు. బొగ్గు అధికంగా వినియోగించడం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో పొగ కమ్ముకుని వాతావరణం కాలుష్యమవుతోంది. అందుకే వీటిపై నిషేధం విధించింది ప్రభుత్వం. ఎలక్ట్రిక్ ఓవెన్ లేదా ఎల్పీజీ గ్యాస్లను మాత్రమే వినియోగించాలని అధికారులు ఆదేశించారు. మధ్యప్రదేశ్లోని వారికి తందూరీ రోటీ చాలా ఇష్టమైన వంటకం. అక్కడి వారు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ సర్కారు తందూరీ రోటీని బ్యాన్ చేయడం వల్ల ఉసూరుమంటున్నారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
Husband Lifts Wife Body: కన్నీళ్లు తెప్పించే హృదయ విదారక ఘటన.. భార్య శవాన్ని మోస్తూ..
హోటళ్లు, దాబాల నిర్వహణకు ఇప్పుడు కలప-బొగ్గును కాల్చి తందూరీ రోటీ తయారు చేయడం నిషేధమని ఆహార శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. బదులుగా ఎలక్ట్రిక్ ఓవెన్ లేదా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ను ఉపయోగించాలని కూడా సూచించబడింది. రాష్ట్రంలోని ప్రజలు తందూరీ రోటీని చాలా ఇష్టపడుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఈ నోటిఫికేషన్ తర్వాత తందూరీ రోటీ ప్రియులు నిరాశకు గురయ్యారు. అలాగే, ఈ ఆర్డర్ దాబా-హోటల్ యజమానులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రభుత్వ ఆదేశాలతో వ్యాపారం దెబ్బతింటుందని దాబా యజమానులు భయపడుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..