Viral : బస్సు నుంచి జారిపడిపోయిన మహిళ.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral : మనం అనుకోకుండానే కొన్ని సార్లు ఊహించని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. వాటిలో ప్రాణాలు సైతం పోగొట్టుకున్న సందర్భాలు అనేకం. ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బస్సు నుంచి యువతి జారిపోయి రోడ్డు మీద పడి చనిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సేలం జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో రద్దీగా ఉంది. బస్సులో ఖాళీ లేకపోవడంతో ఓ యువతి బస్సు డోర్ దగ్గర ఫుట్ బోర్డుపై నిలుచుంది. బస్సు డ్రైవర్ అతివేగంగా టర్న్ తీసుకోవడంతో డోర్ దగ్గర ఫుట్ బోర్డుపై ఉన్న యువతి పట్టు కోల్పోయింది. ఒక్కసారిగా అమాంతం బస్సులోంచి జారి రోడ్డుపై పడింది. బస్సులోంచి చాలా దూరంగా వెళ్లి పడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Read Also:Bus Accident: అదుపుతప్పి నదిలో పడిన ప్రైవేట్ బస్సు.. 24 మంది మృతి
Also Read
- Delhi: 35 నిమిషాలు సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ రహస్య చర్చలు.. ఈసారి కర్ణాటక పంచాయితీ తెగేనా?
- West Bengal: బెంగాల్ బోర్డర్లో టెన్షన్.. తిరిగి వెళ్లేందుకు బంగ్లాదేశీయుల పరుగులు..
- రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
- Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు యువతి దగ్గరికి పరుగులు తీశారు. యువతిని కాపాడాలని చాలా ప్రయత్నించారు. కానీ, అప్పటికే ఘోరం జరిగిపోయింది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ యాక్సిడెంట్ చాలా షాకింగ్ గా ఉంది. యువతి నిర్లక్ష్యం, బస్సు డ్రైవర్ అతివేగం.. ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమయ్యాయి. మృతురాలిని కౌసల్యగా(20) పోలీసులు గుర్తించారు. నమ్మక్కల్ జిల్లా రసిపురంలో నివాసం ఉంటుంది. అట్టియంపట్టిలో గార్మెంట్ కంపెనీలో ఆమె పని చేస్తుంది. బుధవారం సాయంత్రం డ్యూటీ అయిపోయాక ఇంటికి వెళ్లేందుకు కౌసల్య 6గంటల సమయంలో ప్రైవేట్ బస్సు ఎక్కింది. అయితే, అప్పటికే బస్సులో చాలా రద్దీగా ఉంది. లోపలికి వెళ్లే అవకాశం కూడా లేదు. చీకటిపడిపోతే ఇబ్బంది అవుతుందని భావించిన కౌసల్య.. మరోదారి లేక.. ఆ బస్సే ఎక్కింది. ఫుట్ బోర్డుపైనే నిల్చుంది. చంద్రా థియేటర్ దగ్గర మలుపు వచ్చింది. బస్సు వేగంగా పోవడంతో.. కౌసల్య పట్టు కోల్పోయింది. ఫుట్ బోర్డు నుంచి జారి రోడ్డుపై పడి ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also:Lotus Pond Hyderabad: చేపలు చస్తున్నాయ్.. వాసనకు ముక్కులు పోతున్నాయ్
#சேலம் அருகே தனியார் பேருந்தில் பயணித்த இளம்பெண்,சாலை வளைவில் வேகமாக பேருந்து திரும்பும்போது தவறி கீழே விழுந்து உயிரிழப்பு..
இளம்பெண் பேருந்தில் இருந்து தவறி விழும் சிசிடிவி காட்சி#BusAccident pic.twitter.com/QBxR94fnWG
— RAMJI (@RAMJIupdates) May 4, 2023
తాజావార్తలు
-
Sridhar Babu : హైదరాబాద్లో మరో కొత్త GCC కేంద్రం ఏర్పాటు
-
Delhi: 35 నిమిషాలు సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ రహస్య చర్చలు.. ఈసారి కర్ణాటక పంచాయితీ తెగేనా?
-
Thaman – Anirudh: చేతులు కలిపిన సౌత్ సెన్సేషన్స్.. థమన్ మ్యూజిక్లో అనిరుధ్ ఊరమాస్ సాంగ్!
-
West Bengal: బెంగాల్ బోర్డర్లో టెన్షన్.. తిరిగి వెళ్లేందుకు బంగ్లాదేశీయుల పరుగులు..
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
ట్రెండింగ్
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!