Petrol Bomb Row: దర్యాప్తును ప్రారంభానికి ముందే చంపేశారు.. పోలీసుల తీరుపై రాజ్భవన్ మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol Bomb Row: తమిళనాడు రాజ్భవన్ వద్ద పెట్రోల్ బాంబు విసిరిన ఘటన కలకలం రేపిన విషయం విదితమే. చెన్నైలోని రాజ్భవన్ ప్రధాన గేటు వద్ద ఓ వ్యక్తి పెట్రోల్ సీసాను విసిరేశాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని తమిళనాడులోని రాజ్భవన్ ఆక్షేపించింది. రాజ్ భవన్ గురువారం ఈ ఆరోపణ చేసింది. తమిళనాడు రాజ్ భవన్ పోలీసులపై ప్రశ్నలు సంధించింది. ఈ వ్యవహారంలో దర్యాప్తును ప్రారంభానికి ముందే చంపేసినట్లు వ్యాఖ్యానించింది. పోలీసులు దాడిని సాధారణ చర్యగా పేర్కొని, వివరంగా దర్యాప్తు చేయలేదని ఆయన ఆరోపిచింది. చెన్నైలోని రాజ్భవన్ గేటుపై పెట్రోల్ బాంబు విసిరిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి కొన్ని నెలల క్రితం నగరంలోని బీజేపీ కార్యాలయం వెలుపల ఇదే పని చేసేందుకు ప్రయత్నించాడు.
Also Read: Rajasthan: ప్రమాదంలో 70 లక్షల మంది యువత భవిష్యత్తు.. గెహ్లాట్ సర్కారుపై కేంద్ర మంత్రి ఫైర్
Also Read
- RCB Vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర వివాదం.. కోహ్లీ, అనుష్క శర్మ ఎందుకు షాక్ అయ్యారు..?
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
- Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్దే.. వరల్డ్ కప్లో సూర్యవంశీకి చోటు..
- RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్కు చేరిన ఓపెనర్స్..
“పోలీసులు దాడిపై రాజ్భవన్ ఫిర్యాదును నమోదు చేయలేదు. సుమోటో దాడిని సాధారణ విధ్వంస చర్యగా పలచబరిచారు. తొందరపడి నిందితుడిని అరెస్టు చేసి (అతన్ని) అర్ధరాత్రి మేజిస్ట్రేట్ను మేల్కొలిపి (అతన్ని) జైలుకు తరలించారు. దీంతో ఈ దాడి వెనుక ఎవరున్నారనేది బహిర్గతం చేసే సమగ్ర దర్యాప్తును అడ్డుకున్నట్లయ్యింది. నిష్పాక్షిత దర్యాప్తును ప్రారంభానికి ముందే చంపేశారు’ అని రాజ్భవన్ ఎక్స్లో పోస్ట్ చేసింది.
Also Read: Delhi High Court: నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది.. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేరు..
అయితే అక్కడికక్కడే ఉన్న పోలీసు సిబ్బంది ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజ్భవన్ ఫిర్యాదు రాత్రి 11 గంటల ప్రాంతంలో మాత్రమే అందిందని, అందులో పేర్కొన్న వివరాలను కూడా విచారణలో తీసుకుంటామని వారు చెబుతున్నారు. డీఎంకే అధికార మంత్రి ఎస్ రేగుపతి ఘటనను ఖండిస్తూ ఎలాంటి భద్రతా లోపం లేదని స్పష్టం చేశారు. “రాజ్భవన్కు మంచి రక్షణ ఉంది. దర్యాప్తు జరుగుతోంది,” భద్రతా లోపం లేదని మంత్రి కొట్టిపారేశారు. గత ఏడాది చెన్నైలోని బీజేపీ కార్యాలయం బయట పెట్రోల్ బాంబు విసిరిన కేసులో అరెస్టయిన వినోద్ ఎనిమిది నెలల పాటు జైలులో ఉన్నాడు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలా చేసి ఉంటారా అని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. గవర్నర్పై రాజ్భవన్లో డీఎంకె నేతలు, మిత్రపక్షాలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాయంటూ రాజ్భవన్ చేసిన ఆరోపణలపై రేగుపతి స్పందిస్తూ.. ‘గవర్నర్ ఆరోపణలపై ప్రజలకు అర్థమయ్యేలా మాత్రమే స్పందించాం. ఆయనపై మేమెప్పుడూ ద్వేషం పెంచుకోలేదు. తమిళనాడు అంతటా ద్వేషాన్ని వ్యాపింపజేసేది గవర్నర్. ” అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
RCB Vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర వివాదం.. కోహ్లీ, అనుష్క శర్మ ఎందుకు షాక్ అయ్యారు..?
-
Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
-
UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
-
Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
-
Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్దే.. వరల్డ్ కప్లో సూర్యవంశీకి చోటు..
ట్రెండింగ్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!