Inter University Games: మహిళా కబడ్డీ ఆటగాళ్లపై దాడి
- పంజాబ్లో జరిగిన అంతర్-విశ్వవిద్యాలయ కబడ్డీ టోర్నీ.
- తమిళనాడు మహిళా కబడ్డీ క్రీడాకారిణులపై దాడి
- ఘటనపై స్పందించిన తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inter University Games: పంజాబ్లో జరిగిన అంతర్-విశ్వవిద్యాలయ కబడ్డీ మ్యాచ్ సందర్భంగా తమిళనాడు మహిళా కబడ్డీ క్రీడాకారిణులపై దాడి జరగడం కలకలం రేపింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన క్రీడా ప్రపంచానికి చేదు అనుభవంగా మిగిలింది. మ్యాచ్ రెఫరీ తీసుకున్న నిర్ణయం పట్ల క్రీడాకారులు అసంతృప్తిగా ఉండటంతో ఈ గొడవ ప్రారంభమైందని సమాచారం. మదర్ థెరిసా విశ్వవిద్యాలయం, పెరియార్ విశ్వవిద్యాలయం, అలగప్ప విశ్వవిద్యాలయం, భారతియార్ విశ్వవిద్యాలయాలకు చెందిన మహిళా క్రీడాకారిణులు పంజాబ్లో నిర్వహించిన ఉత్తర మండలం అంతర్ విశ్వవిద్యాలయ అండ్ అఖిల భారత అంతర్-విశ్వవిద్యాలయ కబడ్డీ ఛాంపియన్షిప్ 2024-25లో పాల్గొనేందుకు వచ్చారు.
Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళా ప్రాంతంలో మళ్లీ మంటలు.. రెండు వాహనాలు దగ్ధం
Also Read
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- India - Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
ఇక ఈ ట్రోఫీలో మదర్ థెరిసా విశ్వవిద్యాలయం జట్టు సభ్యులపై ప్రత్యర్థి జట్టు సభ్యులు దాడి చేయడం గొడవకు కారణమైంది. సమాచారం ప్రకారం, దర్భంగ విశ్వవిద్యాలయ జట్టుతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో మదర్ థెరిసా జట్టు సభ్యురాలిపై “ఫౌల్ అటాక్” జరిగిందని సమాచారం. దీనిపై రెఫరీ తీసుకున్న నిర్ణయం మరింత ఉద్రిక్తత కలిగించింది. రెండు జట్లు ఒకదానిపై ఒకటి దాడి చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోలో క్రీడాకారిణులు, కొంతమంది వ్యక్తులతో వాగ్వాదం చేస్తూ, ఘర్షణ పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో సిరలు అయ్యాయి. ఆ వ్యక్తులు అధికారులా, లేక ప్రేక్షకులా అన్న విషయం స్పష్టంగా తెలియదు. కొంతమంది కుర్చీలను కూడా విసరడం కూడా వీడియోలో కనిపించింది.
#WATCH | Chennai: On Kabaddi players from the state attacked in Punjab, Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin says, "There was a small incident today morning. I have spoken to the Physical Education Director, Kalaiarasi. Now everything is under control. There are no major… pic.twitter.com/C24kRLLGlI
— ANI (@ANI) January 24, 2025
ఈ ఘటనపై తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. క్రీడాకారిణులందరూ సురక్షితంగా ఉన్నారని, త్వరలోనే వారు రాష్ట్రానికి తిరిగి వస్తారని తెలిపారు. ఆయన మాట్లాడుతూ, “సమాచారం వచ్చిన వెంటనే మేము కోచ్ను సంప్రదించామని, తమిళనాడు క్రీడా అభివృద్ధి సంస్థ (SDAT), జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో సంప్రదించి క్రీడాకారిణుల భద్రతను పర్యవేక్షించామని తెలిపారు. వారు త్వరలో ఢిల్లీ నుంచి తమిళనాడుకు రానున్నారు. ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
తాజావార్తలు
-
Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
-
Zodiac Signs : రేపు ఈ 5 రాశుల వారికి ధనయోగం.. సౌభాగ్య, ఆయుష్మాన్ యోగాల అద్భుత కలయిక
-
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్పాట్..
-
Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!