Subsidy: టీ కొట్టు, హోటల్ యజమానులకు శుభవార్త.. దానిపై రూ.2 తగ్గింపు..
- కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం..
- విద్యుత్ యూనిట్పై రూ.2 రాయితీ ప్రకటన..
- మహిళలకు రూ.10 లక్షల రుణాలపై రూ.2 లక్షల రాయితీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాల వల్ల గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన వంట గ్యాస్ (LPG) సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీనివల్ల తమిళనాడులో గ్యాస్ కొరత తీవ్రమై, హోటళ్లు, చిన్న వ్యాపారాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో చిన్న వ్యాపారులను ఆదుకోవడానికి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటానికి ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్యాస్ సిలిండర్ల కొరత తీరే వరకు, విద్యుత్ స్టవ్లను ఉపయోగిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, టీ షాపులకు విద్యుత్ యూనిట్కు రూ. 2 చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది. గ్యాస్ నుంచి ఎలక్ట్రిక్ స్టవ్లకు మారాలనుకునే చిన్న తరహా పరిశ్రమలు (MSME), చిన్న వ్యాపారులకు ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పిస్తోంది. అంతేకాదు.. ఈ రుణాలపై 25 శాతం రాయితీని కూడా ప్రకటించింది.
Also Read:SSY Account: ‘సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31 చివరి తేదీ..
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో.. వారు తీసుకునే రూ. 10 లక్షల లోపు రుణాలపై రూ. 2 లక్షల వరకు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. ప్రస్తుత గ్యాస్ కొరత దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రులు , విద్యా సంస్థలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ సరఫరా చేస్తోంది. ఫలితంగా వాణిజ్య అవసరాలకు గ్యాస్ సిలిండర్లు దొరకడం కష్టంగా మారింది. హోటళ్లు మూతపడితే.. వాటిపై ఆధారపడిన రైతులు, కూరగాయల సరఫరాదారులు నష్టపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని నివారించడానికి.. హోటళ్లు నిరంతరాయంగా నడవాలని ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలను తీసుకువచ్చింది. హోటళ్లు మూతపడకుండా ఉండేలా చూడటంతో పాటు.. రైతులు తమ పంటలను ఎలాంటి ఆంక్షలు లేకుండా నేరుగా రైతు బజార్లలో అమ్ముకోవడానికి అనుమతినిచ్చారు. సామాన్యుల అవసరాలను తీర్చడానికి రేషన్ కార్డుదారులకు ఈ నెలలో అదనంగా కిరోసిన్ను సరఫరా చేయనున్నారు. గ్యాస్ సరఫరాలో అక్రమాలను అరికట్టడానికి, పంపిణీని సజావుగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!