Ind vs WI: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా నేడు టీమిండియా, వెస్టిండీస్ మధ్య పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో వెస్టిండీస్ బ్యాటింగ్కు దిగనుంది. కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు టీమ్లకు డూఆర్ డైగా నిలవనుంది. గెలిచిన జట్టు సెమీఫైనల్కు చేరుకుంటుంది. ఓడిన జట్టు ఎలిమినేట్ అవుతుంది. అందుకే ఈ మ్యాచ్పై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు టీమ్లు రెండు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిసిన కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడారు. “ఇది చేజింగ్ గ్రౌండ్. రెండో ఇన్నింగ్స్లో వికెట్ ఇంకా మెరుగవుతుంది. ప్రేక్షకులకు మంచి ప్రదర్శన ఇవ్వాలని చూస్తున్నాం. గత మ్యాచ్లో అన్ని బాక్సులు టిక్ చేశాం. అదే జట్టుతో కొనసాగుతున్నాం” అని చెప్పాడు. ఈ ప్రకటనతో భారత్ ప్లేయింగ్ ఎలెవన్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం అయింది. ఈడెన్ గార్డెన్స్ హోమ్ గ్రౌండ్గా ఉన్న రింకూ సింగ్కు అవకాశం దక్కలేదు. మరోవైపు వెస్టిండీస్ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. అదనపు స్పిన్ ఆప్షన్గా అకీల్ హొసేన్ను జట్టులోకి తీసుకుంది. పవర్ప్లేలో బంతితో మరింత వైవిధ్యం ఇవ్వాలని వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఆశ్చర్యకరంగా రోస్టన్ చేజ్ను ఓపెనర్గా జట్టులో పేర్కొన్నారు.
READ MORE: Breaking News: మోడీ అధ్యక్షతన అత్యున్నత CCS సమావేశం..
భారత్ ప్లేయింగ్ ఎలెవన్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
వెస్టిండీస్ ప్లేయింగ్ ఎలెవన్: షాయ్ హోప్ (వికెట్ కీపర్/కెప్టెన్), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మైర్, రోవ్మన్ పావెల్, షెర్ఫేన్ రదర్ఫోర్డ్, రొమారియో షెఫర్డ్, జేసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకీల్ హొసేన్, గుడకేష్ మోటీ, షమార్ జోసెఫ్.
