Supreme Court: చెట్ల నరికివేతపై సమర్థించుకోవద్దు.. సుప్రీం ఆగ్రహం
- చెట్ల నరికివేతపై సుప్రీం ఆగ్రహం
- తదుపరి విచారణ మే 15 కు వాయిదా
- అప్పటి వరకు 'స్టేటస్ కో'.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ అంశంపై నేడు (బుధవారం) జరుగుతున్న విచారణ సందర్భంగా.. “చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు” అంటూ జస్టిస్ బి. ఆర్.గవాయ్ వ్యాఖ్యానించారు. ఇక మరోవైపు ప్రభుత్వ పక్షాన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్వి వాదనలు వినిపించారు. అయితే, ఈ విచారణలో.. నాశనం చేసిన వందల ఎకరాల అడవులను మీరు ఎలా పునరుద్ధరిస్తారు? అంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీలకు తావులేదని స్పష్టం చేసింది. అలాగే మేము చూసిన వీడియోలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. అడవిలో నివసించే జంతువులు షెల్టర్ కోసం పరుగులు తీయగా, వీధుల్లో ఉండే కుక్కలు వాటిని కరిచాయని సమాచారం వచ్చింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
1996లో ఇచ్చిన తీర్పును విస్మరించి అధికారులు తమకు తాము మినహాయింపులు ఇచ్చుకుంటే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు హెచ్చరించింది. ప్రైవేట్ ఫారెస్ట్ లలో సైతం చెట్లను నరికితే అదే తీరు కొనసాగుతుందని, అటువంటి చర్యలను సీరియస్గా పరిగణిస్తామని పేర్కొంది. భూముల తాకట్టు అంశాలతో తమకు సంబంధం లేదని, నరికిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని కోర్టు ఆదేశించింది. డజన్ల బుల్డోజర్లతో వంద ఎకరాలలోని చెట్లను ఎందుకు తొలగించారు? ఇది ఎలా సరైన చర్య అవుతుందని ప్రశ్నించింది.
Also Read
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
- TG20 తొలి ఛాంపియన్గా 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్'.. ఖమ్మం ఏసెస్పై 6 వికెట్లతో ఘన విజయం.!
- National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
అభివృద్ధి అవసరమేనని, కానీ అది పర్యావరణాన్ని నాశనం చేసేలా ఉండకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. సిటీకి గ్రీన్ లంగ్ స్పేస్ అవసరం. వన్యప్రాణుల రక్షణ కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నాశనం చేసిన అడవులను ఎలా రీస్టోర్ చేస్తారో స్పష్టం చెయ్యండి… అంటూ కోర్టు ప్రశ్నించింది. చెట్ల నరికివేతకు ముందే అనుమతులు తీసుకోవాల్సింది అంటూ జస్టిస్ గవాయ్ హెచ్చరించారు. మొత్తంగా, చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ.. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. ఈ అంశంపై తదుపరి విచారణను మే 15 కు వాయిదా వేసింది. అప్పటి వరకు ‘స్టేటస్ కో’ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
-
Nag Ashwin: నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు… ‘కల్కి’పై విమర్శలకు నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్
-
Bihar Bank Account Glitch: పింఛను తీసుకునే తండ్రీకొడుకుల ఖాతాలో.. ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్..!
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Slum Dog Release : పూరీ జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ సినిమా థియేట్రికల్ రైట్స్ కొనేదెవరు?
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!