Supreme Court: పెద్ద ఎత్తన చెట్లు నరికి వేత.. ఒక్కో చెట్టుకు రూ.లక్ష జరిమానా!
- ఉత్తరప్రదేశ్లోని తాజ్ ట్రాపెజియం జోన్లో చెట్లు నరికివేత
- ఒక్కో చెట్టుకు రూ. లక్ష జరిమానా విధించిన సుప్రీం
- 454 చెట్లను నరికివేశారని వ్యాపారవేత్తపై ఆరోపణలు
- రూ.4 కోట్ల 54 లక్షల జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని తాజ్ ట్రాపెజియం జోన్లో అక్రమంగా చెట్ల నరికివేత అంశంపై సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరించింది. నరికివేయబడిన ప్రతి చెట్టుకు ఒక వ్యాపారవేత్తకు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఈ వ్యాపారవేత్త మొత్తం 454 చెట్లను నరికివేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీని ప్రకారం.. అతను మొత్తం రూ.4 కోట్ల 54 లక్షలను జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ కేసులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ” చెట్లు నరికి వేయడం ఒకరిని హత్య చేయడం కంటే దారుణం” అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. పర్యావరణానికి హాని కలిగించే వారి పట్ల దయ చూపడానికి వీళ్లేదని స్పష్టం చేసింది.
READ MORE: AP High Court: భీమిలి తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
“అనుమతి లేకుండా 454 చెట్లను నరికివేయడం ఖండించదగినది. ఈ పచ్చని ప్రాంతాన్ని తిరిగి సృష్టించడానికి కనీసం 100 సంవత్సరాలు పడుతుంది.” అని జస్టిస్ అభయ్.ఎస్. ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పర్యావరణానికి హాని కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (CEC) నివేదిక ప్రకారం.. గత సంవత్సరం సెప్టెంబర్ 18 రాత్రి, బృందావన్ చటికారా రోడ్డులోని దాల్మియా ఫామ్ అనే ప్రైవేట్ భూమిలోని 422 చెట్లను, ప్రక్కనే రోడ్డు వెంట ఉన్న రక్షిత అటవీ ప్రాంతంలో 32 చెట్లను అక్రమంగా నరికివేశారు. ఈ మేరకు ఒక్కో చెట్టుకు రూ.లక్ష జరిమానా విధించింది. కంపెనీ యజమాని శివ శంకర్ అగర్వాల్ జరిమానా మొత్తాన్ని తగ్గించాలని కోర్టులో వాదించారు. నేను తప్పును అంగీకరించి క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. ఒకే దగ్గర కాకుండా సమీప ప్రాంతంలో మొక్కలు నాటడానికి అనుమతించాలని కోరారు. అతడి వాదనలు విన్న కోర్టు జరిమానాను తగ్గించడానికి నిరాకరించింది. కానీ సమీప ప్రాంతంలో చెట్లను నాటడానికి అనుమతించింది.
READ MORE: Murders: మూడు దారుణ హత్యలు.. లవర్స్ కోసం భర్తలను చంపిన కిల్లర్ భార్యలు..
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!