NTV Telugu Site icon

Supreme Court: ఓటుకు నోటు కేసు.. విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Supreme Court

Supreme Court

Supreme Court: ఓటుకు నోటు కేసులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. అయితే, ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును చేర్చాలి అంటూ సుప్రీం కోర్టులో ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.. 2017లో ఓటుకు నోటు కేసులో రెండు పిటిషన్లు వేశారు ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి.. రెండు పిటిషన్ల విషయానికి వెళ్తే.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ ఒక పిటిషన్‌ వేయగా.. తెలంగాణ ఏసీబీ నుంచి కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. అయితే, సిద్ధార్థ లూత్రా అందుబాటులో లేరని కేసు నాలుగు వారాలు వాయిదా వేయాలని కోరారు చంద్రబాబు తరపు న్యాయవాది.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది.. అయితే, విచారణ తేదీని ఖరారు చేస్తామన్న తెలిపిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా, గతంలో తెలంగాణలో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించిన విషయం విదితమే.

Read Also: Mega 157: జగదేక వీరుడు అయిపొయింది ఇప్పుడు… ముళ్ళోక వీరుడు?