SRH vs MI: నేడు ముంబైతో సన్రైజర్స్ ఢీ.. 300 స్కోర్పై కన్నేసిన ఎస్ఆర్హెచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL-2024: ఐపీఎల్ లో ఇవాళ ( సోమవారం ) ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడబోతుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7. 30 గంటలకు జరగనుంది. అయితే, ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొడుతున్న హైదరాబాద్ టీమ్ 300 పరుగుల స్కోర్ పై కన్నేసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసిన్, నితీశ్ కుమార్ రెడ్డి, భీకర ఫామ్ లో ఉండటంతో ఎస్ఆర్హెచ్ కు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. మరోవైపు, వరుస ఓటములతో ముంబై ఇండియన్స్ డీలా పడింది. 11 మ్యాచ్ ల్లో 3 గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.
Read Also: Geethanjali Malli Vachindi : ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
అలాగే, ఎస్ఆర్హెచ్ 10 మ్యాచ్ లలో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదవ ర్యాంక్ లో కొనసాగుతుంది. కాగా, ముంబై ఇండియన్స్ జట్టులో బ్యాటింగ్ లో నిలకడ కనిపించడం లేదు. సూర్యకుమార్ కేకేఆర్ పై అర్ధ సెంచరీ తర్వాత మళ్లీ పెద్దగా రాణించలేదు. ఎంఐ క్యాప్టెన్ హార్థిక్ పాండ్యా అటు బౌలింగ్ లో ఇటు బ్యాంటింగ్ లో వరుసగా విఫలమవుతున్నాడు.. దీంతో విమర్శకుల నోటికి పని చెబుతున్నారు. అయితే, జట్టులో కేవలం రోహిత్ శర్మ, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, టీమ్ డెవిడ్ ఇలా దూకుడైన బ్యాటింగ్ తో రాణించడంలో జట్టు భారీ స్కోర్ చేస్తుంది. కానీ, ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం అని క్రీడా విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.
Read Also: Gun Fire : కాలిఫోర్నియాలో కాల్పులు.. ఏడుగురికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం
ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి అంకానికి చేరుకుంది. ప్లే ఆఫ్ బెర్త్ల కోసం అన్ని జట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని జట్లకు ప్లేఆఫ్ ఆశలు పూర్తిగా కొల్పోయే పరిస్థితికి చేరుకున్నాయి. ఎక్కువ ఓటములు చెంది పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న జట్లకు ప్లేఆఫ్ లో చోటు దక్కే ఛాన్స్ దాదాపుగా లేనట్లే అనుకోవాలి. అందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ లాంటి టీమ్స్ ఉన్నాయి. ఇవి ఎంత పోరాడినా ప్లే ఆఫ్ కు చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే ఈ జట్లు ప్లే ఆఫ్ ఆశలు దాదాపు వదులుకున్నట్లేనని చెప్పుకోవాలి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!