Sundeep Kishan : సంక్రాంతి క్లాష్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన కుర్ర హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sundeep Kishan : దసరా, సంక్రాంతి సీజన్లు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు చాలా స్పెషల్. ఈ సీజన్లో వీలైనన్నీ ఎక్కువ సినిమాలు విడుదల చేయాలని చూస్తారు. ఆ సందర్భంలో పదుల సంఖ్యలో సినిమాలు జనాల ముందుకు వస్తుంటాయి. టాక్ తో సంబంధం లేకుండా ఆ సమయంలో భారీ వసూళ్లను అందుకుంటాయి. దీంతో మేకర్స్.. పండుగల సీజన్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. చిన్న హీరో నుంచి పెద్ద హీరోల దాకా సంక్రాంతికే తమ చిత్రాలను రిలీజ్ చేయాలని భావిస్తుంటారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు నిలుస్తున్నాయో ఇంకా ఫిగర్ ఫిక్స్ కాలేదు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో సంక్రాంతి రావాలని భావించారు. కానీ వాయిదా వేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అదే తేదీన స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విడుదల కానుంది. సీనియర్ బాలకృష్ణ NBK 109 సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది. వెంకటేష్, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ మాత్రం సంక్రాంతి బరిలో నిలిచేట్లు లేదు. వాయిదా పడేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ.. పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.
Read Also:Korean conflict: సౌత్ కొరియా అధ్యక్షుడి కార్యాలయ పరిసరాల్లో చెత్త బెలూన్.. కిమ్పై ఆగ్రహం
Also Read
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
నాగచైతన్య.. తండేల్ మూవీ కూడా సంక్రాంతికి బరిలో నిలుస్తుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ రీసెంట్ గా తమ నిర్ణయాన్ని చేంజ్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి తర్వాత రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు యంగ్ హీరో సందీప్ కిషన్ మంచి ఛాన్స్ కొట్టేశారని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. తండేల్ తప్పుకోవడంతో.. సందీప్ కిషన్ మజాకా సినిమాకు మరిన్ని థియేటర్లు దొరుకుతాయని చెబుతున్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లోని 50 శాతానికి పైగా థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు విడుదల చేయాలని అనుకుంటున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. స్పెషల్ అండ్ బెనిఫిట్ షోలు కూడా వేయనున్నారట. అదే సమయంలో బాలయ్య మూవీకి 25 శాతం థియేటర్లు దక్కనున్నట్లు సమాచారం. మిగతా థియేటర్లలో మజాకా రిలీజ్ కానుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ ఎంటర్ టైనర్ గా మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా.. రావు రమేశ్, మన్మథుడు ఫేమ్ అన్షు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Read Also:Hyderabad: చైతన్యపురి లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. కిచెన్ పరిసరాల్లో మురుగు నీరు..
తాజావార్తలు
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..