NTV Telugu Site icon

Stock Market Crash : కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. అయోమయంలో ఇన్వెస్టర్లు

Stock Marktes

Stock Marktes

Stock Market Crash : భారత స్టాక్ మార్కెట్‌ ఇన్వెస్టర్లుకు నేడు బ్యాడ్ న్యూస్. ఈ రోజు మార్కెట్ కుప్పకూలిపోయింది. ప్రపంచ మార్కెట్ల క్షీణతే ఇలా మార్కెట్ పడిపోవడానికి కారణమని చెబుతున్నారు. అమెరికా మార్కెట్ల పతనం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ 650 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. భారత స్టాక్ మార్కెట్ వారం మొదటి రోజు భారీ పతనంతో ప్రారంభమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 2,393.77 పాయింట్లు లేదా 2.96 శాతం పతనంతో 78,588 వద్ద ప్రారంభమైంది. ఇది కాకుండా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 414.85 పాయింట్లు లేదా 1.68 శాతం క్షీణతతో 24,302 వద్ద ప్రారంభమైంది.

Read Also:Pakistan : పాకిస్థాన్‌లో ఆకస్మిక వరదలు.. 24 గంటల్లో 11 మంది మృతి

ప్రీ ఓపెన్ లోనే మార్కెట్ భూకంపం
ఈరోజు స్టాక్ మార్కెట్ ప్రీ-ఓపెనింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 3774.81 పాయింట్లు లేదా 4.66 శాతం భారీ పతనంతో 77207.14 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 605.10 పాయింట్లు లేదా 2.45 శాతం భారీ పతనంతో 24112.60 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

Read Also:EC: ఎన్నికలను అప్రతిష్టపాలు చేసేందుకు ‘తప్పుడు ప్రచారం’ చేస్తున్నారు..కాంగ్రెస్ పై ఈసీ మండిపాటు

ప్రపంచ మార్కెట్లలో ఈ క్షీణత ఎందుకు కనిపిస్తోంది?
శుక్రవారం అమెరికా మార్కెట్ల పతనం, నేడు ఆసియా మార్కెట్ల పతనం సునామీ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. శుక్రవారం వాల్ స్ట్రీట్‌లోని ప్రధాన అమెరికన్ సూచీలలో సుమారు రెండున్నర శాతం భారీ పతనం నమోదైంది. అమెరికా స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 610.71 పాయింట్లు లేదా 1.51 శాతం క్షీణించి 39,737.26 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా S&P500 1.84 శాతం క్షీణించింది. టెక్ స్టాక్ ఫోకస్డ్ ఇండెక్స్ నాస్‌డాక్ కాంపోజిట్ 2.43 శాతం క్షీణించి 16,776.16 పాయింట్లకు చేరుకుంది.