Bhopal: కాంగ్రెస్ నిరసన కార్యక్రమంలో అపశృతి.. వేదిక కూలి ఏడుగురికి గాయాలు

  • భోపాల్‌లో కాంగ్రెస్ నిరసన కార్యక్రమంలో అపశృతి
  • నిరసన చేస్తుండగా కూలిన వేదిక
  • ఏడుగురు కాంగ్రెస్ నాయకులకు గాయాలు.
Bhopal

Bhopal

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. మధ్యప్రదేశ్ సర్కార్ రైతులు, నిరుద్యోగులు, మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పిదంటూ కాంగ్రెస్ నిరసన చేసింది. ఈ క్రమంలో అసెంబ్లీ ముట్టడికి వారు ప్రయత్నించారు. బారీకేడ్లను తొలగించుకుని దూసుకెళ్లడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు.ఈ క్రమంలో వాటర్ కెనాన్లను పోలీసులు ప్రయోగించి. దీంతో.. తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది.

Read Also: Kannppa: ‘కన్నప్ప’ ప్రేమ పాట.. ప్రీతి ముకుందన్’తో విష్ణు రొమాన్స్!

మరోవైపు.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేస్తున్న నిరసనలో వేదిక కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు కాంగ్రెస్ నాయకులకు గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మేంద్ర సింగ్ చౌహాన్ సహా గాయపడిన వారిని అంబులెన్స్‌లలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ మాట్లాడుతూ.. పార్టీ నాయకులు రంగమహల్ స్క్వేర్ సమీపంలో ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తుండగా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ వైపు కవాతు చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని తెలిపారు.

Read Also: Crime: బీజేపీ నాయకుడి భార్య దారుణ హత్య.. గొడ్డలితో నరికి చంపిన దుండగుడు