SSC Exam Fee : పదవ తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
- పదవ తరగతి విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది
- పదవ తరగతి పరీక్షలకు ఫీజులు చెల్లింపుకు గడువు పెంపు
- నవంబర్ 28 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష రుసుమును చెల్లించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSC Exam Fee : పదవ తరగతి విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలకు ఫీజులు చెల్లించేందుకు ఇప్పటికే షెడ్యూల్ను విడుదల చేసింది తెలంగాణ విద్యాశాఖ. అయితే.. ఆ షెడ్యూల్ ప్రకారం ఈనెల 18తో గడువు ముగియనుంది. ఈ క్రమంలో పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు తేదీని సవరిస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2025, SSC/OSSC/వొకేషనల్ పబ్లిక్ పరీక్షలకు హాజరు కావాలనుకునే రెగ్యులర్, ప్రైవేట్ ఒకసారి ఫెయిల్ అయిన అభ్యర్థులు, నవంబర్ 28 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష రుసుమును చెల్లించవచ్చని పేర్కొంది.
Also Read
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
- IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
- Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
అయితే.. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 10, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 19 వరకు విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించేందుకు అవకాశం కల్పించింది. అంతేకాకుండా.. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 30 వరకు పరీక్ష ఫీజు అంగీకరించబడుతుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంబంధిత ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించవచ్చు లేదా https://www.bse.telangana.gov.in/ వెబ్సైట్ను సందర్శించవచ్చు.
గతంలో ఫీజు చెల్లించాలంటే విద్యార్ధులు చదివే పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫీజు రుసుము చెల్లిస్తే.. ప్రధానోపాధ్యాయుడు లేదా పాఠశాలల సిబ్బంది బ్యాంకుకు వెళ్లి చలానా తీసేవారు. అయితే ఇకపై ఇలా చేయాల్సిన అవసరం లేదని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఇక నుంచి పదో తరగతి పరీక్షల ఫీజును ఆన్లైన్లోనే చెల్లించవచ్చని తెలిపింది. ఆ మేరకు చలానా విధానాన్ని రద్దు చేసినట్లు ప్రకటన జారీ చేసింది. ఇక నుంచి పరీక్షల ఫీజులను ఆన్లైన్లోనే చెల్లించేలా మార్పు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు తెలిపారు. మరింత పూర్తి సమాచారం క్రింద ఇవ్వబడింది..
Pawan Kalyan: రిజర్వేషన్ల పేరుతో రాజకీయం చేసే వాళ్లకు బుద్ధి చెప్పాలి

తాజావార్తలు
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!