SSC Exam Fee : పదవ తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
- పదవ తరగతి విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది
- పదవ తరగతి పరీక్షలకు ఫీజులు చెల్లింపుకు గడువు పెంపు
- నవంబర్ 28 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష రుసుమును చెల్లించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSC Exam Fee : పదవ తరగతి విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలకు ఫీజులు చెల్లించేందుకు ఇప్పటికే షెడ్యూల్ను విడుదల చేసింది తెలంగాణ విద్యాశాఖ. అయితే.. ఆ షెడ్యూల్ ప్రకారం ఈనెల 18తో గడువు ముగియనుంది. ఈ క్రమంలో పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు తేదీని సవరిస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2025, SSC/OSSC/వొకేషనల్ పబ్లిక్ పరీక్షలకు హాజరు కావాలనుకునే రెగ్యులర్, ప్రైవేట్ ఒకసారి ఫెయిల్ అయిన అభ్యర్థులు, నవంబర్ 28 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష రుసుమును చెల్లించవచ్చని పేర్కొంది.
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
అయితే.. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 10, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 19 వరకు విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించేందుకు అవకాశం కల్పించింది. అంతేకాకుండా.. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 30 వరకు పరీక్ష ఫీజు అంగీకరించబడుతుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంబంధిత ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించవచ్చు లేదా https://www.bse.telangana.gov.in/ వెబ్సైట్ను సందర్శించవచ్చు.
గతంలో ఫీజు చెల్లించాలంటే విద్యార్ధులు చదివే పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫీజు రుసుము చెల్లిస్తే.. ప్రధానోపాధ్యాయుడు లేదా పాఠశాలల సిబ్బంది బ్యాంకుకు వెళ్లి చలానా తీసేవారు. అయితే ఇకపై ఇలా చేయాల్సిన అవసరం లేదని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఇక నుంచి పదో తరగతి పరీక్షల ఫీజును ఆన్లైన్లోనే చెల్లించవచ్చని తెలిపింది. ఆ మేరకు చలానా విధానాన్ని రద్దు చేసినట్లు ప్రకటన జారీ చేసింది. ఇక నుంచి పరీక్షల ఫీజులను ఆన్లైన్లోనే చెల్లించేలా మార్పు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు తెలిపారు. మరింత పూర్తి సమాచారం క్రింద ఇవ్వబడింది..
Pawan Kalyan: రిజర్వేషన్ల పేరుతో రాజకీయం చేసే వాళ్లకు బుద్ధి చెప్పాలి

తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!