NTV Telugu Site icon

Srisailam Mallanna Temple Hundi: శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.4 కోట్లు

Srisailam

Srisailam

Srisailam Mallanna Temple Hundi: శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు.. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా.. శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 4 కోట్ల 04 లక్షల 21 వేల 906 రూపాయల నగదు రాబడిగా లభించిందని ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 28 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 332 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారం అలానే వెండి 5 కేజీల 760 గ్రాములు లభించగా నగదు బంగారుతో పాటు 1768 యుఎస్ఏ డాలర్లు, 1 ఖత్తార్ రియాల్, 45 యుఏఈ దిర్హమ్స్, 5 కెనడా డాలర్లు 10 యూరోస్, 50 యుకె ఫౌండ్స్ ,55 ఆస్ట్రేలియా డాలర్లు, 1 మలేషియా రింగిట్స్, 109 సింగపూర్ డాలర్లు మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ లెక్కింపులో లభించాయని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో పెద్దిరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

Read Also: Mexico: రైలుతో సెల్ఫీ తీసుకోవాలని అత్యుత్సాహం.. ప్రాణాలు విడిచిన మహిళ..!