Srisailam: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి బ్రహోత్సవాలు నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు శ్రీ స్వామివారి యాగ శాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా సాయంకాలం శ్రీకాళహస్తి దేవస్థానం తరపున శ్రీస్వామి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ చేయనున్నారు.
Read Also: Suryakumar Yadav: కోహ్లీ రికార్డుకు చెక్.. సూర్య భాయ్ నయా హిస్టరీ..
ఇక, శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ఆర్జిత, పరోక్ష సేవలు నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వీఐపీలు, సాధారణ భక్తులు అందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనంతో పాటు జ్యోతిర్ముడి కలిగిన శివ స్వాములకు మాత్రమే 12వ తేదీ వరకు నిర్ణీత సమయంలో స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, శ్రీశైలం వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.