Srilanka Crisis: దయచేసి వరి సాగు చేయండి.. రైతులను వేడుకుంటున్న ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ద్వీపదేశం శ్రీలంక తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దేశ ఖజానాలో విదేశీ మారక నిల్వలు లేవు. దీంతో ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఉంది. అయితే దేశంలో ఆహార సంక్షోభం మరింత పెరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులు వరిని సాగు చేయాలని ప్రభుత్వం వేడుకుంటోంది. ఇప్పటికే ఆహార సంక్షోభం తీవ్రంగా ఉందని.. మరో 50 శాతం ఉత్పత్తి తగ్గితే శ్రీలంక పరిస్థితులు మరింత తీవ్ర పరిస్థితులకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శ్రీలంకలో ఏడు దశాబ్ధాలలో ఎప్పుడు లేనంతగా ఆహార, ఆర్థిక సంక్షోభం నెలకొంది. 2.2 కోట్ల జనాభా ఉన్న చిన్న దేశం అనేక సమస్యలతో అల్లాడుతోంది. ఆహారం, ఇంధనం, మెడిసిన్స్ ఇలా కీలక దిగుమతుల కోసం డబ్బులు చెల్లించడానికి చిల్లిగవ్వ కూడా లేదు. వచ్చే ఐదు, పది రోజుల్లో రైతులంతా తమ పొలాల్లో అడుగుపెట్టి వరిని సాగు చేయాలని కోరుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అమరవీర మంగళవారం అన్నారు. ఇప్పటికే శ్రీలంక కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే రానున్న కాలంలో ఆహారం సంక్షోభం తీవ్రం అవుతుందని ఇప్పటికే హెచ్చరించారు. అయితే ఎరువులను దిగుమతి చేసుకోవడానికి 600 మిలియన్ డాలర్లు అవసరమవుతాయని అంచనా వేశారు.రాబోయే రెండు సీజన్లలో వరి, తేయాకు, మొక్కజొన్నకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండే అవకాశం కూడా తక్కువగానే ఉంది.
Also Read
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
భారత్ నుంచి 65,000 టన్నుల ఎరువులను సేకరించేందుకు భారత్ తో చర్చలు జరుపుతున్నట్లు, మరో ఏడు దేశాలకు కోరుతున్నామని అమరవీర చెప్పారు. అయితే ఇవి ఎప్పుడు శ్రీలంకకు చేరుతాయో చెప్పలేమని ఆయన అన్నారు. ప్రస్తుతం శ్రీలంకలో కరెన్సీ విలువ 50 శాతం క్షీణించిది. ఆహార ద్రవ్యోల్భనం 46 శాతానికి చేరుకుంది.
తాజావార్తలు
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..