Sri Lanka: దిత్వా తుఫాన్తో 510 మందికి పైగా మృతి.. రంగంలోకి భారత్ సహాయక బృందాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lanka: శ్రీలంకలో కొనసాగుతున్న దిత్వా తుఫాన్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. వర్షాల దెబ్బతో వరుసగా కొండచరియలు విరిగి పడటం, భారీ వరదలు ఏర్పడటం వల్ల అనేక ప్రాంతాలు పూర్తిగా నాశనం అయ్యాయి. ముఖ్యంగా కాండీ జిల్లా తీవ్రంగా దెబ్బతింది. ఒకప్పుడు పర్యాటకులతో కిలకిలలాడిన ఈ ప్రాంతం ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయినట్టుగా మారిపోయింది. మొత్తం పట్టణం నీట మునిగి, రోడ్లు, ఇళ్లు, పంటభూములు అన్నీ వరద ప్రవాహంలో కలిసిపోయాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 510 మందికి పైగా మరణించినట్లు అధికారిక సమాచారం. మరో 386 మందికి పైగా ఆచూకీ గల్లంతయ్యింది. శిథిలాలలో ఇంకా చాలా మంది ఉండే అవకాశముండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ చెబుతోంది. యాబైవేలకు పైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అనేక వందల ఇళ్లు పాక్షికంగా ధ్వంసమై నివాసయోగ్యం లేకుండా మారాయి.
READ MORE: Bharat Taxi: ఓలా, ఊబర్ లకు ధీటుగా రాబోతున్న భారత్ టాక్సీ..
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
ఈ తుఫాన్ ప్రభావం దాదాపు 12 లక్షల మందిపై పడింది. వేలాదిమంది నిరాశ్రయులై సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఆహారం, నీరు, ఔషధాలు వంటి అవసరాల కొరత తీవ్రమవడంతో పరిస్థితి మరింత విషమిస్తోంది. కాండీతో పాటు అంపారా, బదుల్లా జిల్లాలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. రవాణా మార్గాలు తెగిపోవడంతో సహాయక చర్యలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్ ‘ఆపరేషన్ సాగర్ బంధ’ ద్వారా పెద్దమొత్తంలో సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు వందలాదిమందిని సురక్షిత ప్రదేశాలకు తరలించి, ఆహారం, తాగునీరు, అత్యవసర వైద్య పరికరాలను పంపించింది. నౌకాదళం, వైమానిక దళం కలిసి చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. శ్రీలంక ప్రభుత్వం భారత్ సహాయాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపింది.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
-
Story Board : పెట్రోల్ భారం.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఆర్థిక వ్యవస్థ ఎటు వైపు?
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!