Site icon NTV Telugu

Mrithyunjay: శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్’ ట్రైలర్ లాంచ్ చేయనున్న ఎన్టీఆర్..

Sree Vishnu Mrithyunjay

Sree Vishnu Mrithyunjay

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన నటించిన సరికొత్త చిత్రం ‘విష్ణు విన్యాసం’ నేడే (ఫిబ్రవరి 27) విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుండగా, వెంటనే తన తదుపరి చిత్రం ‘మృత్యుంజయ్’ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మార్చి 6, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటిస్తోంది.. ఇంతకు ‘సామజవరగమన’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా..

ఈ చిత్ర ట్రైలర్‌ను శనివారం (ఫిబ్రవరి 28) విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అది కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయబోతుండటం ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ సినిమాకు భారీ హైప్ రావడం ఖాయం. శ్రీవిష్ణు, ఎన్టీఆర్ మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్లే తారక్ ఈ వేడుకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా శ్రీవిష్ణు కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

Exit mobile version