Gaddam Prasad Kumar: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పు వెలువరించారు. రెండు పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు సభ్యులు బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని స్పష్టం చేశారు. దీంతో దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. “నేను కేసీఆర్కు జవాబుదారీగా ఉంటాను.. ఇన్ని రోజులు నాపై ఫిర్యాదు చేసిన వాళ్ల గురించి మాట్లాడలేదు. నాపై ఏ అధికారంతో ఫిర్యాదు చేశారని ఇప్పుడు అడుగుతున్నాను. నాపై కొందరు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేశారు. స్పీకర్ పరిధిలో నేను ఏ తప్పూ చేయలేదు. తీర్పు ఎలా ఉన్నా నాకు ఒకే. ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే సిద్ధమే. పాదయాత్ర చేసి మళ్ళీ గెలుస్తాను. స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఉపఎన్నిక వస్తె భయపడేది లేదు. పోటీ చెయ్యడానికి any time ready. నేను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చెయ్యలేదు. హైదరాబాద్ వాసిగా నాకు ఎప్పటికైనా ఎంపీ అవ్వాలని నా కోరిక.. అందుకే నేను ఎంపీగా పోటీ చేశాను.” అని తీర్పుకు ముందు మీడియాతో వెల్లడించారు.
READ MORE: Harish Shankar : హరీష్ శంకర్ వివాదాస్పద ‘తథాస్తు’ ట్వీట్.. ఉస్తాద్ భగత్ సింగ్ పై ట్రోలింగ్